శర్వానంద్ తో కీర్తి సురేష్..?
ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. శర్వానంద్ తో కీర్తి సురేష్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ ఇద్దరి కాంబో ప్రేక్షకులను నిజంగానే ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పొచ్చు. లూజర్ సీరీస్ తో డైరెక్టర్ గా మెప్పించిన అభిలాష్ రెడ్డి ఈ సినిమా కథను కొత్తగా రాసుకున్నారని తెలుస్తుంది.
శర్వానంద్ కీర్తి సురేష్ ఈ జంట సినిమాకు హైలెట్ అవ్వనుంది. ఐతే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందట. మాళవిక నాయర్ కూడా సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తుందట. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా పై శర్వానంద్ చాలా నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది.
యువి క్రియేషన్స్ లో రన్ రాజా రన్, మహానుభావుడు సినిమాలు హిట్ అందుకున్న శర్వానంద్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. దసరా తర్వాత టాలీవుడ్ లో కీర్తి సురేష్ చేస్తున్న సినిమా ఇదే అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ కూడా సినిమాపై సూపర్ ఆసక్తిగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఇయరే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు శర్వానంద్. వీటితో పాటుగా దిల్ రాజు చేస్తున్న శతమానం భవతి నెక్స్ట్ పేజ్ సినిమాకు కూడా శర్వానంద్ పనిచేస్తున్నాడు.