మళ్లీ మోదీ ప్రధాని అయితేనే దేశం సేఫ్‌?

Chakravarthi Kalyan
ఈరోజు దేశం కోసం ధర్మం కోసం దేశ భద్రత సమగ్రత కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ గారికి బిజెపి కి ఓటేసి ఆశీర్వదించాలంటున్నారు బీజేపీ నేతలు. ఈ నెల 13న ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు.. నేను బిజెపి కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు నేను పిలుపునిస్తున్నానని కిషన్‌ రెడ్డి అంటున్నారు.

ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో అందరూ పోలింగ్ రోజు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాను.. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి.. రేపు అందరూ ఇంటింటి ప్రచారం నిర్వహించాలి ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ని కలిసే విధంగా ఆ ప్లానింగ్ చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని మరొకసారి గుర్తు చేస్తున్నాను.. ఈనెల 10వ తేదీన ఆ ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్  నగరానికి రాబోతున్నారు.. ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి ప్రతి కార్యకర్త కష్టపడి నగరంలోని ప్రజలందరినీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరిని మోడీ సభకు హాజరయ్యేల పనిచేయాలని కిషన్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: