టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే శృతిహాసన్ గురించి తెలిసిన వారు ఎవరైనా సరే తనకి ఇష్టమైన కలర్ ఏది అంటే బ్లాక్ అని టక్కున చెప్పేస్తారు. ఎందుకు అంటే ఎక్కడ కనిపించిన ఏ వీడియోలో కనిపించినా ఈ ఫోటోలో కనిపించినా కూడా తను ఎక్కువగా బ్లాక్ డ్రెస్ లోనే కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఇదే విషయాన్ని శృతిహాసన్ కి చెప్తే ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. అందరూ అందరికీ నచ్చరు. ఎవరైనా నన్ను దెయ్యం, భూతం అని పిలిచినా ఆ మాటల్ని పొగడ్తలగానే భావిస్తాను అని శ్రుతి హాసన్ క్లారిటీ ఇచ్చేసింది.
దీంతో తరచూగా తనపైన ట్రోల్స్ వస్తుండటంతోనే ఈ విధంగా స్పందించింది అని అంటున్నారు. ఒక మహిళా నటి పొగడ్తలే కాదు, విమర్శలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇతరుల అభిప్రాయాలకు భయపడటం, బాధ పడటంలాంటివి చేయను అని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది శ్రుతి హాసన్. నాకు నలుపు రంగు, లోహాభరణాలు ధరించడం అంటే చాలా ఇష్టం. సంగీతంపై ఇష్టం ఉన్నవారు మెటల్స్ ఎక్కువగా ధరిస్తారు అని అనుకుంటారు. కానీ వాళ్లు మాత్రమే కాదు చాలామంది అలాంటి ఆర్నమెంట్స్ ధరిస్తారు అని చెప్పింది శ్రుతి. అలాంటి దుస్తులు, ఆర్నమెంట్స్ వల్ల తనలో శక్తిని రెట్టింపు
చేస్తాయి అని చెప్పారామె. అయితే ఆ ఆభరణాలు నచ్చని కొందరు దెయ్యంలా ఉన్నావని కామెంట్ చేస్తుంటారని చెప్పింది. అందుకు తాను అలాంటి ట్రోల్స్ని పట్టించుకోను అని చెప్పేసింది శ్రుతి. మీరు నేచురల్ బ్యూటీ కాదట కదా.. మీ గురించి ఈ విషయంలో విమర్శలు వస్తున్నాయి అని అంటే… 'విమర్శలు ఏముంది… ఆ విషయంలో నేనే ఒప్పుకుంటాను అంటూ చెప్పింది. దీంతో ప్రస్తుతం శృతిహాసన్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.!!