మరింత ఆలస్యంగా ఓటీటీలోకి 'హనుమాన్'

Anilkumar
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్' ఈ సంక్రాంతికి జనవరి 12 న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా స్వామి రంగ వంటి సినిమాలు విడుదలైనా వాటన్నిటిలో 'హనుమాన్' యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సౌత్, నార్త్, ఓవర్సీస్.. అనే తేడా లేకుండా విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా రిలీజై రెండు వారాలు దాటినా ఇంకా కలెక్షన్ల సునామీ ఆగలేదు. ఈ సినిమా తొలి వారంతో పోల్చితే రెండో వారంలో కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇక ఇప్పటికే హనుమాన్‌ రూ.250 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్‌ అయిపోయినట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5 హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ కి నెల రోజుల తర్వాత ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ ప్రస్తుతం థియేటర్స్ వద్ద హనుమాన్ దూకుడు ఏమాత్రం తగ్గకపోవడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్  వాయిదా వేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం థియేట్రికల్ రిలీజ్ పూర్తయిన 55 రోజుల తర్వాతే హనుమాన్ ని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ నిర్ణయించారట. ఇందుకు ZEE5 సంస్థ కూడా ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

దాని ప్రకారం మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావచ్చని అంటున్నారు. ఆ సమయంలో శివరాత్రి పండగ కూడా ఉండడంతో హనుమాన్ ని అదే సమయంలో రిలీజ్ చేస్తే ఓటీటీలో రెస్పాన్స్ అదిరిపోతుందని మేకర్స్ ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ZEE5 త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.
'హనుమాన్' సినిమాకి సీక్వెల్‌గా 'జై హనుమాన్‌' తీస్తున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు ప్రశాంత్‌ వర్మ.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: