'గుంటూరు కారం' ఎఫెక్ట్.. త్రివిక్రమ్ కి మహేష్ ప్రామిస్!

Anilkumar
త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్లో ఈ సంక్రాంతికి 'గుంటూరు కారం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా విషయంలో ఎక్కువగా త్రివిక్రమ్ పైనే విమర్శలు వచ్చాయి. ఈ సినిమాని గురూజీ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారనే వాదనలే ఎక్కువగా వినిపించాయి. ఈ విషయం కాస్త పక్కన పెడితే.. నిజానికి 'గుంటూరు కారం' మెటీరియలైజ్ కాకముందే త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఓ భారీ యాక్షన్ మూవీని తీయాలని అనుకున్నాడట. మహేష్ కూడా ముందు ఓకే చెప్పాడు.

కానీ కొద్ది రోజుల తర్వాత ఏమైందో తెలియదు తన మనసు మార్చుకుని ఎలాగూ రాజమౌళితో పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ మూవీ చేయాలనుకోవడంతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దామని త్రివిక్రమ్ కి చెప్పారట. దాంతో త్రివిక్రమ్ 'గుంటూరు కారం' స్క్రిప్ట్ ని రెడీ చేశాడు. సంక్రాంతికి రిలీజ్ ని లక్ష్యంగా పెట్టుకోవడంతో 4-5 నెలల పాటు హడావిడిగా షూటింగ్ జరిగింది. మధ్యలో కొన్ని సార్లు షూటింగ్ వాయిదా కూడా పడింది. ముందే టైం లిమిట్ పెట్టుకోవడంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ పై పూర్తిస్థాయిలో కసరత్తులు చేయలేకపోయాడు. అందుకే 'గుంటూరు కారం' రిజల్ట్ తేడా కొట్టింది. ఇది కచ్చితంగా త్రివిక్రమ్,

మహేష్ బాబు ఇద్దరూ కలిసి చేసిన మిస్టేక్ అని చెప్పొచ్చు. కథ మార్చమని త్రివిక్రమ్ కి చెప్పడం మహేష్ చేసిన తప్పయితే, తక్కువ సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీని మాస్ టైటిల్ పెట్టి, స్క్రీన్ ప్లేని సరిగ్గా డీల్ చేయకపోవడం త్రివిక్రమ్ చేసిన తప్పు. ఇక 'గుంటూరు కారం' రిజల్ట్ తర్వాత మహేష్ మొదట అనుకున్న యాక్షన్ మూవీ చేస్తానని త్రివిక్రమ్ కు మాట ఇచ్చాడని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ప్రాజెక్టు ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. ఇప్పటికే 'SSMB29' సినిమా కోసం మహేష్ ఫారిన్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. రాజమౌళి సినిమా కోసం సుమారు మూడేళ్ల పాటు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం మహేష్ - త్రివిక్రమ్ ప్రాజెక్టు రాజమౌళి సినిమా తర్వాతే పట్టాలెక్కే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: