ఎన్టీఆర్ తో తలబడబోతున్న బాలీవుడ్ యాక్టర్...!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా హీరోలు సక్సెస్ లను అందుకుంటూ వస్తున్నప్పటికి ఎన్టీఆర్ మాత్రం వరుసగా ఆరు హిట్లను తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు దేవర సినిమాతో ఏడో సక్సెస్ ని కొట్టడానికి మన ముందుకు రాబోతున్నాడు.అయితే తను ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో భారీగా వైరల్ అవుతుంది.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టు గా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా సంజయ్ దత్ నటించబోతున్నాడు అనే వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పటికే సంజయ్ దత్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన కే జి ఎఫ్ 2 లో విలన్ గా నటించాడు. ఇక ఆ చనువుతోనే ఇప్పుడు తనని సినిమాలోకి తీసుకోవాలని చూసెమటున్నట్టు గా వార్తలు వస్తున్నాయి.
మరి ఈ సినిమాతో ఎన్టీయార్ ఎంతవరకు మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక సంజయ్ దత్ ఇప్పటి వరకు తెలుగులో హీరోలకి విలన్ గా నటించలేదు మిగితా భాషల్లో హీరోలకు విలన్ గా నటించాడు తప్ప తెలుగులో మాత్రం నటించలేదు కాబట్టి ఈ సినిమాతో తెలుగు మార్కెట్ మీద కూడా సంజయ్ దత్ భారీగా కన్ను వేసినట్టుగా తెలుస్తుంది.   ఇక ఎన్టీఆర్ లాంటి నటుడు ప్రశాంత్ నీల్ లాంటి దర్శకుడు కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే దానిమీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగానే ఉంటాయి మరియు వాటన్నింటిని రీచ్ అయ్యేలా సినిమా ఉంటుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక కొరటాలతో చేస్తున్న దేవర సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం ఈ సినిమా మీద అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. వాటిని అందుకోవాలంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు... చూడాలి మరి ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: