బాలీవుడ్ కు పోయింది.. ఇప్పుడు మళ్లీ సౌత్ వైపే చూస్తోంది?

praveen
అర్జున్ రెడ్డి అనే సినిమా మీకు గుర్తుందా అని తెలుగు ప్రేక్షకులను అడిగితే.. అయ్యో అలాంటి సినిమాలు ఎలా మర్చిపోతాం అని సగటు క్రికెట్ ప్రేక్షకుడు సమాధానం చెబుతాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ మూవీ ఇక టాలీవుడ్ లో సరికొత్త ట్రెండుకు నాంది పలికింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత ఎంతోమంది యంగ్ హీరోస్ తమ సినిమాలతో రిస్క్ చేయడానికి సిద్ధమైపోయేలా అందరికీ ధైర్యాన్ని ఇచ్చింది. అయితే ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ కూడా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. అయితే ఈ మూవీతో పెద్దగా గుర్తింపును సంపాదించుకోలేకపోయిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది హీరోయిన్ శాలిని పాండే అని చెప్పాలి. ఈ మూవీలో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా తన హావాభావాలతోనే డైలాగ్స్ పండించి ప్రశంసలు అందుకుంది శాలిని పాండే. ఇక ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వస్తాయ్ అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అడప దడపా అవకాశాలు మాత్రమే అందుకుంది షాలిని. విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే.. షాలిని మాత్రం అవకాశాలు లేక ఇంటి దగ్గర కూర్చున్న పరిస్థితి కూడా ఏర్పడింది.

 అయితే చిన్నచితక అవకాశాలు మాత్రమే రావడంతో తనను టాలీవుడ్ చిన్నచూపు చూస్తుంది అనుకుందో లేకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీ కళ్ళకు అద్దుకుంటుంది అనుకుందో కానీ చివరికి గొప్పలకు పోయి టాలీవుడ్ ను వదిలేసి.. ఇక బాలీవుడ్ వాకిట్లో వాలిపోయింది. అయితే అక్కడ ఎంత ప్రయత్నించినా ఛాన్సులు రాలేదు. వచ్చిన అవకాశాలు విజయం సాధించలేదు. దీంతో హిందీలో ఈ అమ్మడికి కాలం కలిసి రాలేదు. దీంతో ఇన్నాళ్ళకి మళ్ళీ సౌత్ వైపే ఆశగా చూస్తుంది ఈ హీరోయిన్. ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తుంది. మరో తెలుగు సినిమాలో నటించబోతుంది. లవర్ సినిమాకు సీక్వల్ చేయబోతున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాలో హీరోయిన్గా శాలిని పాండేను తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: