అలా చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్న జూ. ఎన్టీఆర్....!!

murali krishna
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత దాదాపు సంవత్సరం పాటు గ్యాప్ తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తన తరువాత సినిమా ను పట్టాలెక్కించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు.కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత జెట్‌ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్ ఈ ఏడాది మార్చి ఎండింగ్‌లో కొరటాల కాంబినేషన్‌ లో దేవర సినిమాను మొదలు పెట్టారు..మొదటి షెడ్యూల్‌ లో రెండు నెలల పాటు యాక్షన్‌ మరియు టాకీ పార్ట్ చిత్రీకరించారు.
ఆ తరువాత కూడా షార్ట్ గ్యాప్స్‌ తోనే వరుస షెడ్యూల్స్‌ లో షూటింగ్ చేస్తున్నారు. వీలైనంత వరకు బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ చేసేలాగే ప్లాన్ చేస్తోంది కొరటాల టీమ్.ఎన్టీఆర్ స్పీడు కు కొరటాల మేకింగ్ స్టైల్‌ కూడా తోడవడం తో దేవర పార్ట్ వన్‌ షూటింగ్ జెట్‌ స్పీడు తో పూర్తవుతోంది.ఈ డిసెంబర్‌ కల్లా మొదటి భాగానికి గుమ్మడి కాయ కొట్టేస్తారన్న టాక్‌ వినిపిస్తోంది. అదే జరిగితే టాప్ స్టార్స్‌ లో పాన్ ఇండియా సినిమాను ఇంత త్వరగా పూర్తి చేసిన రికార్డ్ ఎన్టీఆర్ కి దక్కుతుంది.ఎన్టీఆర్ డిసెంబర్‌ కల్లా దేవర పార్ట్ 1 వర్క్‌ ఫినిష్ చేసి జనవరి నుంచి వార్ 2 సెట్‌ లో అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.


యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆల్రెడీ వర్క్ ఔట్స్ కూడా మొదలు పెట్టేసారు.. ఎన్టీఆర్‌ ఇంత స్పీడు గా సినిమాలు పూర్తి చేస్తుండటం తో ఫ్యాన్స్‌ కూడా ఫుల్ ఖుషి గా వున్నారు.తాజాగా దేవర మూవీ నుంచి వస్తున్న ఓ అప్‌డేట్ జూనియర్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది..మరో 150 రోజుల్లో దేవర వచ్చేస్తున్నాడు అంటూ చిత్రం యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.సినిమా విడుదల అయ్యే సమయానికల్లా సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ వరుస గా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: