ఆ కారణంగా కష్టాల్లో పడ్డ ఏ ఆర్ రెహమాన్ సాంగ్....!!

murali krishna
ఈ మధ్య కాలంలో పాటలను రీమేక్ చేసే ట్రెండ్ జోరుగా సాగుతోంది. వీటిలో కొన్ని వివాదాలు కూడా సృష్టించాయి. ఇప్పుడు ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాకూర్, ప్రియాంషు నటించిన 'పిప్పా' లోని ఓ పాట వివాదంలో చిక్కుకుంది.లోని 'కారా ఓయ్ లోహ్ కపట్' అనే పాట వైరల్ అయ్యింది. దాంతో ఈ సాంగ్ పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాదు సంగీత దర్శకుడు రెహమాన్‌ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే..'పిప్పా' చిత్రం ఈ రోజు (నవంబర్ 10) అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదలైంది. ఈ చిత్రానికి రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహించాడు. అలాగే ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని 'కరా ఓయ్ లోహ్ కపట్' పాట ఇప్పుడుచర్చనీయాంశమైంది. రెహమాన్ తనదైన శైలిలో ఈ పాటకు సంగీతం అందించారు. దీనిపై పలువురు విమర్శలు గుప్పించారు. ఇది బెంగాలీ పాట రీమేక్ అని.. ఈ పాట ఉద్దేశం చెడగొట్టారని అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఏఆర్ రెహమాన్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో రెండు రోజుల క్రితం ఈ పాటను విడుదల చేశారు. బెంగాల్ ప్రజల మనోభావాలతో రెహమాన్ ఆడుకుంటున్నారని కొందరు ఆరోపించారు. ఈ సాంగ్ నిరసనల కోసం ఉపయోగించే ప్రభావవంతమైన పాట. ఇది స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి ఇష్టమైన పాట. సంవత్సరాలుగా చాలా మంది సంగీత స్వరకర్తలు ఈ పాటకు వారి సొంత వెర్షన్‌లో కంపోజ్ చేశారు. ఇప్పుడు రెహమాన్ కంపోజ్ చేసిన కొత్త పాట సారాంశాన్నిపూర్తిగా మార్చేసిందని అంటున్నారు. దాంతో ఆయన పై విమర్శలు చేస్తున్నారు. రెహమాన్ ఈమధ్య కాలంలో తరచు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం రెహమాన్‌పై వివాదాలు చెలరేగాయి. మొన్నామధ్య చెన్నైలో స్టేజ్ ప్రోగ్రామ్ ఇచ్చారు రెహమాన్. దీని కోసం భారీగా ప్రజలు తరలివచ్చారు. టిక్కెట్లు ఉన్నప్పటికీ పలువురిని లోపలికి అనుమతించలేదు. ఇది చాలా చర్చకు దారితీసింది. ఆ తర్వాత రెహమాన్ క్షమాపణలు కూడా చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: