బ్రో సక్సెస్ తో 'OG' సినిమాపై కీలక అప్డేట్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో. ఇక నిన్ను విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తమిళ సినిమా అయిన వినోదయ సీతం సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని డైరెక్టర్ మరియు నటుడు అయిన సముద్రఖని దర్శకత్వంలో వచ్చింది. అయితే ముందుగా ఈ సినిమాకి వేరే టైటిల్ని అనుకున్నారట దర్శకుడు. కాల పురుషుడు కాలభైరవ శివుడు ఓ వంటి టైటిల్స్ ని ముందుకు అనుకున్నారట. అయితే ఈ టైటిల్స్ కంటెంట్ పై తప్పు అంచనాలకు దారితీస్తుందని ఆలోచించిన డైరెక్టర్ చివరికి బ్రో అనే ఒక సింపుల్ టైటిల్ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. 

అయితే ఈ సినిమాపై అభిమానులతో పాటు కొందరు ప్రముఖులు సైతం చాలా పాజిటివ్ గా స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ ఈ సినిమా పై కొన్ని కీలక వ్యాఖ్యలను చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమా బ్రో ని ఇప్పుడే చూశాను ఈ సినిమా ప్రపంచంలో ఎవరు శాశ్వతం కాదనే అంశంతో తెరకేకించడం జరిగింది.. మానవ జీవితాలను సృష్టిస్తుంది.. పవన్ అభిమానులే కాదు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది.. అని ఆయన తన సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం జరిగింది. ఇక బ్రో సినిమాపై ఒక ఎంపీ మాత్రమే కాకుండా అటు పవన్ అభిమానులు సైతం చాలా సంతోషంగా ఉన్నారు.

అయితే మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు బ్రో సినిమా సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాలి. ఈ నేపథ్యంలోని సాహో ఫేమ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అయితే ఓ జి సినిమా నుండి ఒక కీలక అప్డేట్ వచ్చిందని అంటున్నారు. అయితే ఈ సినిమా ఐదు షెడ్యూల్ వచ్చి నెలలు ప్రారంభం కాబోతున్నట్లుగా ఇటీవల సుజిత్ చెప్పడం జరిగింది. అయితే ఆ షూట్ లో పవన్ కళ్యాణ్ సైతం జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: