టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త మూవీ గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఎదో ఒక వార్త ఎప్పుడు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తోన్న ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ఈ మూవీలో మహేష్ బాబుకు జోడీగా హాట్ బ్యూటీ పూజాహెగ్డే నటిస్తుండగా మరో కీలక పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటించనున్నారు. ఇటీవలే శ్రీలీల పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన శ్రీలీల లుక్ అయితే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుంటూరు కారం మూవీలో శ్రీలీల పల్లెటూరు అమ్మాయిలా కనిపించనుంది. అందుకే ఈ మూవీకి అనుకోని బ్రేక్ లు పడుతున్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి పండగ పురస్కరించుకొని విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. కాగా ఇప్పుడు ఈ మూవీ విడుదల ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.
ఈ మూవీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సోమవారం నుంచి గుంటూరు కారం మూవీ కొత్త షెడ్యూల్ ను ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ మూవీ షెడ్యూల్ మరింత ఆలస్యం అవుతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ఆలస్యానికి కారణం కూడా ఇద్దరు నటులు అని సమాచారం తెలుస్తోంది.ఇక వీరిలో ఒకరు శ్రీలీల కాగా మరొకరు ప్రకాష్ రాజ్ అని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే శ్రీలీల ప్రస్తుతం తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.వరుసగా మూవీలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే అరడజనుకు పైగా మూవీలు ఈ అమ్మడి ఖాతలో ఉన్నాయి. దాంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో సినిమా షూటింగ్ కు హాజరవడం కుదరడం లేదట. అలాగే మరో వైపు ప్రకాష్ రాజ్ కు కూడా ఇదే సమస్య తలెత్తెడంతో గుంటూరు కారం సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా విడుదల పై అనుమానాలు మొదలయ్యాయి.