ఆ దర్శకుడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహేష్ ఫ్యాన్స్....!!

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కి ఇటీవలే గుంటూరు కారం అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది.మాస్ తో పాటు అన్ని వర్గాల వారికి కూడా గుంటూరు కారం టైటిల్ నచ్చింది అంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా చెప్పుకొచ్చారు. ఆ విషయం పక్కన పెడితే షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు గుంటూరు కారం సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరో సినిమా ను కమిట్ అవ్వడం పట్ల కొందరు విమర్శలు చేస్తున్నారు.

అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబోలో ఒక ప్రాజెక్ట్ ను ఆహా ఓటీటీ వారు అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాంతో మహేష్ బాబు అభిమానులు స్పందిస్తూ.. అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా లు చేసుకోవడంలో మాకు ఎలాంటి ఇవ్బంది లేదు. కానీ ఇప్పుడు గుంటూరు కారం సినిమా రూపొందుతూ ఉండగా ఎందుకు అల్లు అర్జున్ సినిమా ను మొదలు పెట్టాలి అనుకుంటున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఎలా ఉంటుంది అసలు ఓటీటీ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనే విషయం కూడా తెలుసుకోకుండా చాలా మంది ఇష్టానుసారంగా త్రివిక్రమ్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు అయినా ఆ విషయమై క్లారిటీ వస్తుందా.. త్రివిక్రమ్ పై మహేష్ బాబు అభిమానుల యొక్క విమర్శలు ఆపుతారా అనేది చూడాలి. మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. మరి అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబో ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: