సత్యదేవ్ అక్కడే సినిమాలు చేసుకుంటే మంచిది..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ లో నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో సత్యదేవ్. వర్సటైల్ హీరో గా ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న అయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే గాడ్సే సినిమా తో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇంతటి స్థాయి కి ఎదగడానికి చాలా కష్టపడ్డారని చెప్పాలి. రావడమే ఆయన హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టలేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో అలరించి నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు టాలెంటెడ్ యాక్టర్ అనిపించుకున్నారు.

అలా ఎన్నో సంవత్సరాలు హీరో గా చేసిన తర్వాత ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించి మంచి అభిమానులను ఏర్పరుచుకున్నారు. ఈ క్రమంలో వైవిధ్యమైన కథలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ మంచి హీరోగా ఎదుగుతున్న ఈ హీరో సినిమాలకు థియేటర్లలో ఆదరణ కరువవుతుంది చెప్పాలి. ఆయన సినిమాలకు మంచి అప్లాజ్ వస్తుంది కానీ థియేటర్లలో ప్రేక్షకులను ఆ సినిమాలు అలరించలేకపోతున్నాయి. కానీ ఓటీటీలో ఆయన చిత్రాలకు మంచి గుర్తింపు దక్కుతుంది.

ఆయన హీరో గా నటించిన తాజా సినిమా 'గాడ్సే' ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. కానీ ఈ సినిమా కు పెద్దగా ఆదరణ దక్కలేదు. అందుకే ఈ సినిమా జూలై 17 నుండి ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా అలరించకపోయిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను ఎలా అలరిస్తుందో చూడాలి. ఓటీటీ లో ఈ హీరో సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు వస్తున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. సికె స్క్రీన్స్ బ్యానర్ పై సి కళ్యాణ్ నిర్మించిన ఈ థ్రిల్లర్ డ్రామాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది.  ప్రేక్షకులు కూడా ఈ సినిమా ను ఓటీటీ లో చూడడానికి ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: