తన సినిమా మీద తనకు నమ్మకం ఉంటుందంటున్న డీజే టిల్లు..!!

Divya
కొత్త హీరోలకు, కొత్త దర్శకులకు సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య బాగా ప్రోత్సాహం పెరిగిపోయింది.. ఒక మోస్తరు బడ్జెట్ తో కూడిన సినిమాలను నిర్మిస్తూ సరికొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ ఉన్నారు అల్లు అరవింద్ ,దిల్ రాజు, సితార బ్యానర్ వంటి వారు. అయితే ఇదే తంతు లో సితార బ్యానర్ పై డీజే టిల్లు సినిమాను నిర్మించారు. ఇందులో హీరోగా జొన్నలగడ్డ సిద్దు.. హీరోయిన్ నేహా శెట్టి నటించింది. ఈ సినిమా రేపు విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ ను చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఇక ఈ వేదికపై సిద్దు కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. వాటి గురించి పూర్తిగా చూద్దాం.

ఇక డీజే టిల్లు సినిమాలో తనతో పాటు నటించిన అమ్మాయి పేరు స్నేహ శెట్టి.. అయితే ఆమె కొన్ని అనివార్య కారణాలవల్ల ఇక్కడికి రాలేదు. ఆమె ఇక్కడికి  రాకపోవడం వల్ల మా టీం చాలా ఎనర్జీ ని కోల్పోతుంది అంత తెలియజేశాడు.. ఈ మధ్య నేను కొన్ని కొత్త మాటలు వింటున్నా.. అవేమిటంటే బుకింగ్స్, థియేట్రికల్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ అని మాటలు విన్నాను.. ఈ మాటలను అడిగితే ఇవి నీకు అర్థమై చావదు అని అంటున్నారని తెలియజేశారు.


గుంటూరు టాకీస్ సినిమా తర్వాత తను చాలా బ్రేక్ తీసుకున్నాను ఆ తర్వాత థియేటర్లో విడుదల అవుతున్న సినిమా ఇదే అని తెలియజేశాడు.. నా చుట్టూ ఈ సినిమా గురించి ఒక బజ్ ఉంది.. అంతకు మించి ఎనర్జీ ఉంది.. మొత్తానికి అయితే ఈ సినిమా నడుస్తుందని తెలియజేశాడు. సితార వంటి బ్యానర్లో ఈ సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.. సితార బ్యానర్ వంశి గారు కాస్త కోపంగా కనిపించినప్పటికీ.. ఆయన అడిగినవన్నీ ఇస్తూ ఉంటారు అని తెలియజేశారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా థ్రిల్ క్రేజీగా ఉంది అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: