బాలీవుడ్ ఇండస్ట్రీలో తగ్గేదే లే అంటున్న శ్రీ వల్లి..!

N.ANJI
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటులలో రష్మిక ఒక్కరు. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకి ఛలో సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలను అందుకుంది. అయితే ఈ భామ గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుని ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో నటించి ఆమె పాత్రకు ప్రశంసలు అందుకుంది.
అయితే పుష్ప సినిమాను పాన్ ఇండియా సినిమా తెరకెక్కించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. రష్మిక పుష్ప సినిమాలో నటించక ముందే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ అవకాశాలను అందుకున్న సంగతి అందరికి తెలిసిన విదితమే. కాగా.. కరోనా మహమ్మారి కారణం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన సినిమాలు విడుదల కాలేదు లేదంటే ఈపాటికి ఈమె నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది.
మరోవైపు రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో మిషన్ మజ్ను, గుడ్‌బై వంటి చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల కాకుండానే పుష్ప సినిమా ద్వారా శ్రీవల్లి పాత్రలో బాలీవుడ్ ప్రేక్షకులను సందడి చేసిన రష్మిక బాలి వుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ దక్కించుంకుంది అనే చెప్పాలి మరి. అంతేకాకుండా.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న రష్మిక. ఈ సినిమాతో బాలీవూడ్ లో మరొక గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందని సమాచారం.
ఇక ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ పనులను జరుపుకోగా తాజాగా మరొక సినిమా అవకాశం వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. కాగా..ఆ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: