కుబేర’ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మూవీ మేకర్స్..!!

murali krishna
ట్యాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏ సినిమా చేసినా దానికో స్పెషాలిటీ ఉంటుందనే టాక్ ఇప్పటికే ఉంది. తాజాగా ఆయన తెరకిక్కిస్తున్న లేటెస్ట్ మూవీ కుబేరా నుంచి ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది.తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్లో మల్టిస్టారర్గా రూపొందుతున్న చిత్రం 'కుబేర'.కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో కుబేర అని టైటిల్ పెట్టి ధనుష్‌ను బిచ్చగాడి పాత్రలో చూపించారు. కింగ్ నాగార్జున మరో అదిరిపోయే లుక్‌తో దర్శనమివ్వగా, ఫస్ట్ లుక్‌తోనే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. దీంతో శేఖర్ కమ్ముల మరోసారి డిఫరెంట్ స్టోరీతో ఏదో చేయబోతున్నారనే ఆసక్తి కలుగుతోంది.ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేసిన ధనుష్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. కుబేర టైటిల్‌కు భిన్నంగా ధనుష్‌ బిచ్చగాడి గెటప్‌లో ఉండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అటు టాలీవుడ్‌, ఇటు కోలీవుడ్‌ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కింగ్‌ నాగార్జున గెటప్‌ను కూడా మేకర్స్‌ రివీల్‌ చేశారు.ఇందులో నాగార్జున ఫుల్ ఫార్మల్ లుక్లో ఆకట్టున్నారు.
బ్లూ కలర్ షర్ట్, ఫార్మల్ ప్యాంటులో కళ్లజోడు పెట్టుకోని గొడుగుతో వర్షంలో నిలబడి ఉన్న లుక్ బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఇందులో హీరో లుక్ రిలీజ్ చేసి మూవీ అంచనాలు పెంచారు. చిరిగిన దుస్తుల్లో బిచ్చగాడిలా చూపించడం అందరిని ఆశ్చర్యపరిచంది. ఇక ఇందులో హీరోకి పూర్తి అపోజిట్లో నాగార్జున లుక్ ఉంది. ఫుల్ క్లాసి అండ్ ఫార్మల్గా ఉన్న నాగ్ లుక్ ఆద్యాంతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నాగార్జున కుబేర ఫస్ట్లుక్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. పాన్ ఇండియా వస్తున్న ఈ సినిమాలో నాగార్జున మరో హీరో అనే విషయం తెలిసిందే.వర్షంలో తడుస్తున్న నాగార్జున గొడుగు పట్టుకుని ఉండగా వర్షంలో తడిసి ముద్దయిన ఐదు వందల నోటు కనిపిస్తుంది. దాంతో అందరూ నాగార్జున డబ్బులు తీసుకుంటారని భావిస్తారు. కాకపోతే., నాగ్ తన జేబులో నుండి ఓ 500 రూపాయల కాగితాన్ని తీసి ఒకచోట ఉంచాడు. ఈ సన్నివేశంతో నాగార్జున సినిమాలో కథ పట్ల ఆసక్తిని రేకెత్తించింది.కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోనాల్ నారంగ్ సమర్పణలో శేఖర్ కమ్ములకు చెందిన అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: