వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారు.. షన్నూ తండ్రి షాకింగ్ కామెంట్స్?

praveen
ఎప్పుడు బుల్లితెర ప్రేక్షకులందరికీ వినూత్నంగా ఎంటర్టైన్మెంట్ అందించే బిగ్ బాస్  కార్యక్రమం ఇటీవల మాత్రం ఏకంగా ఇద్దరు జీవితాల్లో ఊహించని పరిణామాలకు దారి తీసింది. యూట్యూబర్ గా ఎంతగానో పేరు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ బిగ్బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సిరి తో ఫ్రెండ్షిప్ హద్దులు దాటడం  కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఇక చివరి వరకూ కొనసాగిన షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రేయసి దీప్తి సునైనా ఊహించని షాక్ ఇచ్చింది.

 ఏకంగా షణ్ముఖ్ జస్వంత్ తో ఉన్న ఐదేళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతున్నా అంటూ దీప్తి సునైనా ప్రకటించింది. దీంతో ఇదే సోషల్ మీడియాలో ఎంతగానో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక నా గురించి నేను ఆలోచించుకోవాలని అనుకొంటున్నాను అంటూ దీప్తి సునైనా తెలిపింది. దీంతో ఇక ఎన్నో రోజుల నుంచి వీరి బ్రేక్ అప్ కి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. వీరి బ్రేకప్ కి సిరి కారణం అంటూ కొంతమంది ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక మరోవైపు ఐదేళ్లు ప్రేమలో ఉన్న దీప్తి షణ్ముఖ్ ని  ఆ మాత్రం అర్థం చేసుకోలేదా అంటూ మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ఇక ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ తండ్రి దీప్తి సునైనా షన్నూ బ్రేకప్ పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ గురించిన ప్రశ్న ఎదురు కాగా.. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు దీప్తి బ్రేకప్ చెప్పింది. కానీ షణ్ముఖ్ ఇంకా చెప్పలేదు. వాళ్ళిద్దరి వ్యక్తిగత విషయాల గురించి మనం ఎక్కువగా చర్చించ కూడదు. వారు కలవడానికి కొంత సమయం పడుతుందేమో కానీ తప్పకుండా కలిసే ఉంటారు .అంతా శుభమే జరుగుతుంది అంటూ షణ్ముఖ్ జస్వంత్ తండ్రి వ్యాఖ్యానించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీంతో నిజంగానే షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైనా త్వరలోనే కలవబోతున్నారా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: