అల్లు అర్జున్ ను నిలదీసిన మీడియా.. సారీ చెప్పిన ఐకానిక్ స్టార్?

praveen
ఇంటిలిజెంట్ దర్శకుడు సుకుమార్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల మధ్యన విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన పుష్ప ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్ర బంధం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా ఒకేసారి ఐదు భాషల్లో విడుదల కాబోతుంది అనే విషయం తెలిసిందే. పుష్ప సినిమాతో అటు కోలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు అల్లు అర్జున్.

 అందుకే అటు తెలుగు తో పాటు అన్ని భాషలలో కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగు లో ప్రెస్ మీట్ పూర్తయింది. తాజాగా బెంగళూరులో ప్రెస్ మీట్ నిర్వహించారు పుష్పా టీం.. ఇక ఈ ప్రెస్ మీట్ లో రష్మిక మందన, అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా మీడియా ముందే ఒక జర్నలిస్టు అల్లు అర్జున్ ను నిలదీశాడు. స్టార్ హీరో అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు.

 ఉదయం 11: 15 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది అని చెప్పారు. మీరు 1:15 గంటలకు ఇప్పుడు వచ్చారు. మీరు మీడియో గురించి ఏమనుకుంటున్నారు. ఇంత లేట్ రావడానికి మా సమయం వృధా చేయడానికి గల కారణం ఏమిటి అంటూ అల్లు అర్జున్ ను నిలదీశాడు జర్నలిస్ట్. అయితే తనకుప్రెస్ మీట్ ఏ సమయానికి ఉంది అన్నవిషయం చెప్పలేదు. అయితే తాను ప్రత్యేకమైన ప్రైవేట్ ఫ్లైట్ లో ఇక్కడికి చేరుకున్నాను. కొంచెం మంచు ఉండటం ఫ్లైట్ తొందరగా బయలుదేర లేదు.. అందరు నన్ను క్షమించండి అంటూ సభాముఖంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాడు. ఇక ఇలా అల్లు అర్జున్ సారీ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: