ఆ హీరోయిన్ షూటింగ్ నుంచి పారిపోయింది.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు మీరా మిథున్. ఇక ఈ నటిపై వచ్చే వివాదాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయ్. ఇప్పుడు మరోసారి వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు నటి మీరా మిథున్. ఇటీవలే ఈమె హీరోయిన్ గా మీరా మిథున్  ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పేయా కానోమ్. గ్లోబల్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మీరా మిథున్ తో పాటు నటుడు కౌశిక్, సంధ్య రామచంద్రం, కోదండం లాంటి నటులు కూడా కీలక పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమాతో సెల్వ అన్బరసన్ దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.


 అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ ఇటీవలే జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు సినిమాలో ప్రధానపాత్రలో నటించిన హీరోయిన్ మీరా మిథున్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయంలో హీరోయిన్ మీరా మిథున్ షూటింగ్ నుంచి పారిపోయింది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షూటింగ్ 80 శాతం పూర్తయిన తర్వాత మీరా మిథున్ ను  అనుకోని విధంగా పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మీరా మిథున్ బెయిలు మీద బయటకు రావడంతో మిగతా 20 శాతం షూటింగ్ కొడైకెనాల్లో నిర్వహించాలని నిర్ణయించుకున్నాము.


 మొదట్లో షూటింగ్కి ఎప్పటిలాగానే హాజరైన మీరా మిథున్ ఇక మరో రెండు రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకుంటున్న సమయంలో తనతో పాటు వచ్చిన ఆరుగురు వ్యక్తులతో కలిసి షూటింగ్ స్పాట్ నుంచి పారిపోయింది అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు. దీంతో ఇక మిగిలిన షూటింగ్ ఎలా చేయాలో అర్థం కాలేదు.. కానీ ఎంతో ఆలోచించి సినిమా కథను మార్చి చివరికి మీరా మిథున్ పాత లేకుండా కొత్త స్టోరీ రాసుకుని మిగిలిన షూటింగ్ పూర్తి చేసాము అంటూ దర్శకుడు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: