మరో సరికొత్త బిజినెస్ ని స్టార్ట్ చేయనున్న మహేష్.. ఆ బిజినెస్ ఏంటంటే..?

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మహేష్. ప్రస్తుతం మహేష్ వరుస సినిమాలతో ఎంత బిజీ బిజీగా ఉన్నాడు తెలియని విషయం కాదు. సినిమాలు చేస్తూ డబ్బు సంపాదించడమే కాకుండా  పలు వ్యాపారాలపై ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపారవేత్తగానూ తన టాలెంట్ ను చూపుతున్నాడు మహేష్. అయితే మహేష్ కు గచ్చిబౌలిలో ఏఎంబీ` సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ఉంది. ఇది ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ లలో ఒకటి.

 అంతే కాకుండా తన భార్య నమ్రత తో కలిసి బట్టల వ్యాపారం లోకి కూడా అడుగు పెట్టారు కదా వీరు. ఒక వైపు సినిమాలు మరో వైపు బిజినెస్ చేస్తున్న మహేష్ ఇప్పుడు కొత్తగా మరో బిజినెస్ కూడా స్టార్ట్ చేయనున్నారట.కరోనా కారణంగా ఇప్పుడు అంతా ఆన్లైన్ నడుస్తుంది. అందుకే మహేష్ ఇంకా నమ్రత కలిసి ఆన్లైన్ విద్యాబోధన కోసం ఒక కొత్త యాప్ ను తేవాలి అనుకుంటున్నారు. దీనికోసం కొన్ని కంపెనీలతో కూడా కలిసి మాట్లాడారట. అయితే దీనికోసం మహేష్ సుమారు వంద కోట్లు ఖర్చు చేరనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం మహేష్ ఇంకా బయట పెట్టలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారం చెప్తారేమో.

 అయితే ప్రస్తుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట`  అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ చేస్తోంది. వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది ఏప్రిల్ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమాని పట్టాలెక్కించనున్నాడట. మహేష్ బాబు ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్లో వీరి కాంబినేషన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ని మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: