సడెన్ గా సీక్వెల్స్ పై మోజేంటి?

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సీక్వెల్ సినిమాలు తెరకెక్కడం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పరిశ్రమలోని పెద్దలు అంతా ఆశ్చర్య పోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాలు ఇప్పుడు సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. యువ హీరో ల దగ్గర్నుంచి పెద్ద హీరోల దాకా ఈ సీక్వెల్ మోజు లో ఉండగా టాలీవుడ్ లో క్రేజీ చిత్రాలు గా రాబోతున్న ఆ సీక్వెల్ సినిమా ఎంటో ఇప్పుడు చూద్దాం.

నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ఆ మధ్య ఘనంగా ప్రారంభమయ్యింది అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ రెండవభాగం టాలీవుడ్లో క్రేజీ సీక్వెల్ సినిమా అని చెప్పవచ్చు హీరో నిఖిల్ కూడా తన హిట్ సినిమా కార్తికేయ కు సీక్వెల్ సినిమాలు చేసే పనిలో ఉన్నాడు మొదటి భాగం ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే దర్శకుడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు తెలుస్తుంది.

ఇక వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు కలసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన f3 సినిమా ఫిబ్రవరిలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ కథ చిత్రం గా వచ్చిన f2 సినిమా విజయవంతం కావడం వల్ల ఈ సినిమా సీక్వెల్ రావాలనే డిమాండ్ పెరిగిపోయింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ చేయడానికి ముందుకు వచ్చారు నిర్మాత దిల్ రాజు. ఇక నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమా కు సంబంధించిన బంగార్రాజు చిత్రం ఇటీవలే మొదలయింది. 2022 సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉంది. ఇక అడవి శేష్ నటించిన గూడచారి సినిమా సీక్వెల్ కూడా ప్రేక్షకులను అలరించడానికి త్వరలోనే రాబోతోంది. ఇక జాతిరత్నాలు సీక్వెల్ కేజిఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్2 అలాగే మంచు విష్ణు శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఢీ సినిమా సీక్వెల్ ఢీ అండ్ ఢీ అలాగే క్రాక్, జాతిరత్నలు, జాంబీ రెడ్డి వంటి సినిమా లు త్వరలోనే రాబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: