విషయంలో నిజం ఒప్పుకున్న ప్రశాంత్ నీల్!!

P.Nishanth Kumar
దేశవ్యాప్తంగా పాన్ ఇండియా దర్శకుడిగా మొట్టమొదటిగా పేరు సంపాదించుకున్నాడు టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల అయ్యి హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు రాజమౌళికి గొప్ప కీర్తి ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ లో జక్కన్న మార్కెట్ పెరగడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది. అయితే రాజమౌళి ఇంతటి స్థాయికి చేరడానికి సినిమాలు చేయడం మాత్రమే కాదు సినిమాల్లో తనదైన ముద్ర వేసి మరొక దర్శకుడు చేయలేని విధంగా సినిమాను తెరకెక్కించడం.

నిజానికి ఎవరు ఊహించని రేంజ్ లో దర్శకుడు రాజమౌళి సినిమా ను డిజైన్ చేసి భారీ రేంజ్ లో షూటింగ్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా గా యాక్షన్ సీన్స్ వంటివి గానీ ఏ దర్శకుడు టాలీవుడ్ లో ఆయన లా ఇంతవరకు చేయలేదు. కనీసం ఆయన దరిదాపుల్లో కూడా ఏ దర్శకుడు రాలేదు.  యాక్షన్ సీన్స్ ను జక్కన్న లా ఎవరు చూపించలేక పోయారు. కానీ ఒక దర్శకుడు మాత్రం రాజమౌళి ని తలపించేలా సినిమాను తెరకెక్కించి దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. 

ఆయనే ప్రశాంత్ నీల్. కే జి ఎఫ్ సినిమా తో రాజమౌళి రేంజ్ లో ఆయన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ను రాజమౌళి ని తలదన్నేలా డిజైన్ చేసి ప్రేక్షకులను అబ్బుర పరిచాడు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా తరువాత ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ సినిమాపై టాలీవుడ్ లో గొప్ప అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తప్పకుండా కేజీఎఫ్ ను మించి ఉంటుందని స్వయంగా దర్శకుడు ప్రశాంత్ ఒప్పుకోవడం విశేషం. కే జి ఎఫ్ సినిమా విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని ఆ విధంగా కాకుండా ఈ సినిమా లో ఆ తప్పులు సరిదిద్దుకోవడం వల్లే ఈ సినిమా అవుట్ పుట్ గొప్పగా వస్తుందని ఆయన చెప్పారు. చూడబోతే సలార్ సినిమాతో ప్రశాంత్ రియల్ మరొక గొప్ప సినిమా పోతున్నాడు అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: