రచయితగా దర్శకుడు గా..ఇప్పుడు మరో అవతారం లో గురూజీ!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో రచయిత గా, దర్శకుడి గా తన కంటూ గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు త్రివిక్రమ్. రచయిత గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి స్టార్ రైటర్ గా ఎదిగి ఆ తర్వాత డైరెక్టర్ గా మారాడుం ఆయన తక్కువ సినిమాలు చేసి స్టార్ దర్శకుల జాబితాలో అతి తక్కువ కాలంలో చేరాడు అంటే ఆశ్చర్య పోవాల్సిందే. మాటల మాంత్రికుడిగా, గురూజీ గా టాలీవుడ్ లో పలు బిరుదులు సొంతం చేసుకున్న త్రివిక్రమ్ తో సినిమాలు చేయాలని ప్రతి ఒక్క హీరో ఎంతో ఆశ పడుతూ ఉంటాడు. చిన్న హీరోలు సైతం త్రివిక్రమ్ సినిమాలు చేసే విధంగా ఆయన తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు.
అలా నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆ అనే సినిమా విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసే త్రివిక్రమ్ ఓవైపు రచయితగా డైరెక్టర్ గా కొనసాగుతూనే ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తాడు. తాను చిన్న సినిమా హీరోలతో కూడా సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. గిరి చిన్న హీరోలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.  హాసిని అండ్ హారిక క్రియేషన్స్ నిర్మాణ సంస్థ యొక్క నిర్మాత చినబాబు త్రివిక్రమ్ కు ఎంతో సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే. ఆయనతోనే త్రివిక్రమ్ దాదాపు సినిమాలు అన్ని చేసాడు.
పెద్ద హీరోలను ఒప్పించి మరి ఈ నిర్మాణంలో సినిమాలు చేయించేలా చూస్తాడు. తాజాగా ఈ నిర్మాణ సంస్థలో త్రివిక్రమ్ పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందుతుంది. అయితే నిర్మాతగా మాత్రం ఈయన పేరు కనబడదట. కానీ నిర్మాత సాధించే వసూల్ లో మాత్రం షేర్ వెళుతుందట. జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ దక్కించుకుని క్రేజీ హీరోగా మారిన నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థలో ఒక క్రేజీ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ సినిమా తో త్రివిక్రమ్ నిర్మాత అవతారం ఎత్తి కొంత భాగం డబ్బులు పెట్టుబడి పెడుతున్నాడట. మరి రచయితగా దర్శకుడిగా సూపర్ సక్సెస్ అయిన త్రివిక్రమ్ ఈ కొత్త అవతారంలో ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: