మరదలికి పెళ్ళాం కి తేడా ఇదే.. హైపర్ ఆది రచ్చ?
ఇటీవలే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన కొత్త ప్రోమో సోషల్ మీడియాలో విడుదలై వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో చూస్తుంటే ఈ సారి మరింత డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మొత్తం కవలలతో శ్రీదేవి డ్రామా స్టేజ్ మొత్తం నిండిపోయింది. ఇక ఇటీవల విడుదలైన ప్రోమోలో ముఖ్యంగా హైపర్ ఆది చేసిన హంగామా బాగా హైలెట్ గా మారిపోయింది అని చెప్పాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ లోకి ఎంట్రీ ఇచ్చిన ట్విన్స్ తమ టాలెంట్ బయట పెట్టి అందరిని ఆకర్షించారు.
ఈ క్రమంలోనే అటు హైపర్ ఆది స్కిట్ లో కూడా కొంతమంది కవలలు భాగంగా మారి స్కిట్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఒకే రూపంలో ఉన్న యువతులతో స్కిట్ చేశాడు హైపర్ ఆది. నేను పెళ్లి చేసుకొని ఐదు సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి కూడా వీరిలో మరదలు ఎవరు పెళ్ళాం ఎవరో తెలియదు అంటూ హైపర్ ఆది చెబుతాడు. అలా ఉంటే ఇంకా మంచిదే కదా రా అంటూ అక్కడే ఉన్న బాబా భాస్కర్ పంచ్ వేస్తాడు. ఈ క్రమంలోనే పెళ్ళాం ఎవరు మరదలు ఎవరో తెలుసుకోవడానికి ఇద్దరి నడుము గిల్లుతాడు హైపర్ ఆది. ఇక అప్పుడు వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ బట్టి పెళ్ళాం ఎవరు మరదలు ఎవరు అని పట్టేస్తాడు. సిగ్గు పడింది అంటే మరదలు లాగిపెట్టి కొట్టింది చూశారా అదే పెళ్ళాం అంటూ ఇక మరదలికి పెళ్ళాం కి మధ్య ఉన్న తేడా చెప్పి అందరికి జ్ఞానోదయం చేసేసాడు హైపర్ ఆది.