నిర్మాతగా మారనున్న హాట్ యాంకర్ ?

VAMSI
జబర్దస్త్ షో తో వెలుగులోకి వచ్చి సెలబ్రిటీగా మారిన అనసూయ.గ్లామర్ కి కొత్త అర్థాన్ని చెబుతూ అభిమానుల సంఖ్యను రోజురోజుకీ పెంచుకుపోతోంది. బుల్లి తెర పైనే కాకుండా వెండి తెరపై కూడా తన సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో నాగ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది అనసూయ భరద్వాజ్. ఆ తర్వాత 'క్షణం' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. 'విన్నర్' సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ప్రత్యేక పాటలో ఆడి పాడింది. అలా సినీ రంగంలోకి ప్రవేశించి అక్కడ మంచి అవకాశాలను అందుకుంటోంది. ఈమె కు ఫుల్ క్రేజ్ ఉండడంతో పారితోషికం కూడా భారీ గానే అందుతున్నట్లు సమాచారం. ఇలా ఇటు బుల్లి తెరను అటు వెండి తెరను బ్యాలన్స్ చేసుకుంటూ కెరియర్ ని కొనసాగిస్తున్న అనసూయ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలని ఆలోచిస్తోందట.
అయితే పూర్తి స్థాయిలో కాకుండా ఓ స్టార్ హీరో కి ఉన్న నిర్మాణ సంస్థ లో పెట్టుబడులు పెట్టి భాగస్వామిగా సినిమాను  నిర్మించడానికి రెడీ అయిందట ఈ జబర్దస్త్ బ్యూటీ. ఇప్పటికే ఆ స్టార్ హీరోతో ఈ ఒప్పందానికి సంబంధించి  సంప్రదింపులు జరిగాయని డైరెక్టర్ కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఒకవేల ఫిక్స్ అయితే ఆ సినిమాలో తాను ఒక పవర్ఫుల్ రోల్ చేయాలని యోచిస్తోందట అను. ఇప్పటికే నాలుగు అయిదు కథలు విన్నా ఇంకా బెస్ట్ కాన్సెప్ట్ కోసం ఎదురుచూస్తున్నారు అంటూ వార్తలు వినపడుతున్నాయి.
మరి ఇంతకీ ఏ స్టార్ హీరో నిర్మాణ సంస్థతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది మన రంగమ్మత్త. ఇది నిజమేనా అంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం జబర్దస్త్ షోతో పాటు పలు టీవీ షోలతో బిజీగా గడుపుతోంది ఈ హాట్ యాంకర్. రీసెంటుగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో రంగమ్మత్తను మరపించే పాత్ర చేస్తోందని వినికిడి. మరి చూద్దాం ఆ సినిమాలో తన పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: