పవన్ సినిమాల రిలీజ్ తారుమారు .... మ్యాటర్ ఏంటంటే ..... ??

GVK Writings
కొన్నాళ్ల క్రితం వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ మూవీ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని ఫ్యాన్స్ ని ఖుషి చేసారు. అంతకముందు మూడేళ్ళుగా పవన్ నుండి మూవీ లేకపోవడంతో వకీల్ సాబ్ పై అందరిలో భారీగా అంచనాలు ఏర్పడడం జరిగింది. అయితే ఆ అంచనాలు అందుకునేలా ఎంతో అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు వేణు శ్రీరామ్.
శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీతో పాటు మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ లో కూడా నటిస్తున్నారు. ఏ ఎమ్ రత్నం నిర్మాతగా మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో భారీగా పాన్ ఇండియా రేంజ్ లో నిర్మింతం అవుతున్న పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు లో పవన్ ఒక వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు టాక్. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక దీనితో పాటు చిత్రీకరణ జరుపుకుంటున్న అయ్యప్పనుం రీమేక్ లో పవన్ పోలీస్ అధికారిగా కనిపించనుండగా రానా మరొక ముఖ్య పాత్ర చేస్తున్నారు. సాగర్ కె చంద్ర తీస్తున్న ఈ సినిమాని  యువ నిర్మాత నాగ వంశీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై నిర్మిస్తున్నారు.
అయితే అసలు విషయం ఏమిటంటే, వాస్తవానికి హరిహర వీరమల్లు మూవీ ని వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఇక లేటెస్ట్ గా అందుతున్న న్యూస్ ప్రకారం ఆ సినిమా షూటింగ్ చాలా వరకు బ్యాలెన్స్ ఉండడంతో పాటు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా ఎంతో పెండింగ్ ఉందని, అందువలన సినిమాని మరికొన్నాళ్లు పాటు వాయిదా వేయాలని యూనిట్ భావిస్తోందట. అయితే సంక్రాంతి సమయానికి మాత్రం అయ్యప్పనుం రీమేక్ పూర్తయ్యే ఛాన్స్ ఉందని, త్వరలో ఆ మూవీ షూట్ లో పవన్ పాల్గొననున్నారని, సంక్రాంతికి మూవీని విడుదల చేయడం ఆల్మోస్ట్ ఫిక్స్ అని సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే పవన్ నటిస్తున్న సినిమాల రిలీజ్ తారుమారయినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై అధికారికంగా ఆయా సినిమాల మేకర్స్ నుండి ప్రకటనలు వెలువడాల్సి ఉంది .... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: