ఉప్పెన మొదటి షెడ్యూల్ అయ్యాక హీరోయిన్ ను మార్చారా..?

shami
ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో బాగా వినిపిస్తున్న సినిమా పేరు ఉప్పెన. ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా ఈ సినిమా డిస్కషన్స్ బాగా నడుస్తున్నాయి. సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ మొత్తం రిలీజ్ కు ముందే వచ్చేసింది. ఉప్పెన సినిమా కోసం స్టార్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూసినట్టుగా యూత్ ఆడియెన్స్ ఎగబడుతున్నారు. ఈరోజు పెట్టిన టికెట్స్ కూడా హాట్ కేకుల్లా అయిపోతున్నాయని తెలుస్తుంది. ఇక ఉప్పెనకు ఈ రేంజ్ బజ్ క్రియేట్ అవడానికి విజయ్ సేతుపతి, మెగా హీరో అనే కారణాలతో పాటుగా హీరోయిన్ కృతి శెట్టి కూడా అని చెప్పొచ్చు.
తన క్యూట్ లుక్స్ తో కనుబొమ్మలని ఎగరేస్తూ ప్రేక్షక హృదయాలను గెలిచేసింది బేబమ్మా.. సినిమాలో ఆమె నటనకు అందరు ఫిదా అవుతారని అంటున్నారు. అయితే ఉప్పెన సినిమాకు మొదట అనుకున్న హీరోయిన్ ఈమె కాదని తెలుస్తుంది. సినిమాకు ముందు మనిషా రాజ్ ను అనుకున్నారు. ఆమెతో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగిందట. అయితే డైరక్టర్ బుచ్చి బాబు మనిషా పర్ఫార్మెన్స్ తో సంతృప్తి చెందలేదట. సినిమా చేస్తున్నా ఆ ఫీల్ రాకపోవడంతో సుకుమార్ కు చెప్పి ఆమెను తీసేయించి ఆమె ప్లేస్ లో కృతి శెట్టిని తీసుకున్నారట.
ఉప్పెన సినిమాకు కృతి శెట్టి చాలా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. ఆమె క్యూట్ లుక్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్నాయి. అందుకే కృతి సినిమా రిలీజ్ అవకుండానే పాపులర్ అయ్యింది. వరుస ఛాన్సులు వస్తున్నాయి. అయితే హీరోయిన్ ను మార్చే విషయంలో సుకుమార్ దగ్గర మొహమాట పడ్డాడట బుచ్చి బాబు అందుకు సమధానంగా నీకన్నా నాకన్నా సినిమా పెద్దది దానికి ఏం కావాలో అది ఇవ్వాలని అన్నారట. అలా ఉప్పెనలో మనిషా రాజ్ ఎగ్జిట్ అయ్యి కృతి శెట్టి వచ్చి చేరింది.          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: