జానీ మాస్టర్ కు విడాకులు..భార్య సంచలన ప్రకటన ?

Veldandi Saikiran

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో జానీ మాస్టర్ వివాదం కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. గత నాలుగు రోజులుగా జానీ మాస్టర్ తంతు రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. తన దగ్గరకు డ్యాన్స్ నేర్చుకోవాలని వచ్చిన యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడట. దాదాపు ఏడు సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి.
 
బాధిత మహిళ... 16 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారట జానీ మాస్టర్. దీంతో లేటెస్ట్గా జానీ మాస్టర్ పైన ఫోక్సొ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ చట్టం కింద కేసు నమోదు అయితే.. దాదాపు జానీ మాస్టర్ కు ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... గత నాలుగు రోజులుగా... జానీ మాస్టర్ కోసం వెతికారు.
 
అయితే గురువారం రోజున జానీ మాస్టర్ గోవాలో దొరికిపోయారు. ఇక శుక్రవారం రోజున హైదరాబాద్ కు జానీ మాస్టర్ రానున్నారు. జానీ మాస్టర్ పోలీసులకు దొరికిపోయాడని మీడియాలో వార్తలు రాగానే... వెంటనే హైదరాబాదులోని... ఓ ప్రముఖ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆయన భార్య రచ్చ చేసిందట. తన భర్త తప్పు చేయలేదని...జానీ మాస్టర్ భార్య... మీడియా ముందు వెల్లడించారు. అటు పోలీసులతో కూడా తన బాధను చెప్పుకున్నారు.
 
ఆ బాధిత మహిళలకు ఇప్పటికే ఇతరులతో రిలేషన్ పెట్టుకుందని... తన భర్త పై అన్యాయంగా కేసు పెట్టిందని ఆమె మండిపడుతున్నారు. ఒకవేళ జానీ మాస్టర్ నిజంగానే తప్పు చేస్తే.. ఆయనకు విడాకులు ఇవ్వడం గ్యారంటీ అని పరోక్షంగా ఆమె చెప్పడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ మరింత హాట్ హాట్ గా కొనసాగుతోంది. అయితే కోర్టులో హాజరు పరిచిన తర్వాత జానీ మాస్టర్ కు ఎలాంటి శిక్ష పడుతుందో అందరూ ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: