బుల్లితెర ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకునే నటి ఎవరో తెలుసా.?

Divya
ప్రస్తుత కాలంలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది టీవీ కే పరిమితమవుతున్న విషయం తెలిసిందే. సినిమాలను మించిన ట్విస్టులతో సీరియల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో బుల్లితెర నటీనటులకు కూడా క్రేజ్ భారీగా పెరిగిపోయింది.. ప్రస్తుతం ఉన్న సినిమా స్టార్స్ తో సమానంగా పాపులారిటీ అందుకోవడమే కాదు పారితోషికం విషయంలో కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే సినిమా స్టార్స్ తో సమానంగా పారితోషకం విషయంలో డిమాండ్ చేస్తూ కోట్లల్లో పారితోషకం తీసుకుంటున్న సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ఒక బుల్లితెర నటి మాత్రం భారతదేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి హీనా ఖాన్. 1987 అక్టోబర్ 2న శ్రీనగర్లోని సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఈమె మాంటిస్సోరి స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి ఢిల్లీలోని గార్గీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ సమయంలో హీనా ఖాన్ అక్షర మహేశ్వరి సింఘానియా అనే షోలో లీడ్ క్యారెక్టర్ పోషించడానికి ఎంపికైంది. అయితే ఆ సమయంలో ఆమె వయసు 22 సంవత్సరాలు మాత్రమే.. ఆ తర్వాత నాగిన్, దివా కసౌతి జందగీ కే వంటి టెలివిజన్ సీరియల్స్ లో అదరగొట్టేసింది.  ఆ తర్వాత ఒక బాలీవుడ్ సినిమా వెబ్ సిరీస్ లతో బుల్లితెర ఆడియన్స్ కు మరింత దగ్గరయింది.
ఇకపోతే అటు వెండితెర ఇటు బుల్లితెరలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె నెలకు రూ.35 లక్షల వరకు పారితోషకం తీసుకుంటుందని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రోజుకు ఒక టీవీ ఎపిసోడ్ కు లక్షన్నర రూపాయల వరకు చార్జ్ చేస్తుందట. ఇటీవల కాలంలో రూ .2లక్షలు కూడా తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికైతే దేశంలోనే అత్యంత పాపులర్ బుల్లితెర నటిగా పేరు సొంతం చేసుకుంది. టీవీ షోలో పనిచేయడమే కాదు పలు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కి కూడా పనిచేస్తూ భారీగా సంపాదిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: