బిగ్ బాస్ 8 : హౌస్ లోకి మరోసారి ఆ హాట్ బ్యూటీ. సర్ప్రైజ్ మాములుగా లేదుగా..!!

murali krishna
గతంలో ఎప్పుడూ చూడని సరికొత్త కాన్సె్ప్టులు, టెస్టులతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. బుల్లితెర ప్రేక్షకులను ఓరేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుంది.చూస్తు చూస్తుండగానే రెండు వారాలు పూర్తి చేసుకోబోతుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ లో ప్రారంభమైన ఈ సీజన్.. తొలివారం ఎలిమినేషన్ లో బేబక్క బయటకు వెళ్లిపోయారు. అలాగే నేడు రెండవ ఎలిమినేషన్స్ జరుగుతోంది. ఈ ఎలిమినేషన్స్ లో విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నాగమణికంఠ, శేఖర్‌ భాషా, పృథ్వీరాజ్‌, నిఖిల్‌, సీతా, నైనికా ఉన్నారు. అయితే. శేఖర్ బాషా ఎలిమినేట్అయినసంగతి తెలిసిందే . ఇప్పటికే బయటకు వచ్చాడని వార్తలు వస్తున్నాయి. దీంతో హౌస్ లో 12మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగులు తారు.ఈ క్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ వైల్డ్ కార్డు ద్వారా ఏంట్రీ ఇవ్వనున్న బ్యూటీ ఎవరో చూద్దాం.బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి ముందు వైల్డ్ కార్డు ఏంట్రీ ద్వారా పలువురు పేర్లు తెరమీదికి వచ్చాయి. అందులో జ్యోతిరాయ్‌ అలియస్ జగతి మేడం..ఈ హాట్ బ్యూటీని బిగ్ బాస్ నిర్వహకులు సంప్రదించారట. అయితే.. ఆ బ్యూటీ అటు సీరియల్స్.. ఇటు సినిమాల్లో బిజీగా ఉండడంతో తాను హౌస్ లోకి రాలేనని చెప్పారని టాక్. మరోవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ముక్కు అవినాశ్, శోభా శెట్టి, రోహిణీ, హరితేజ, నయని పావని వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో బ్యూటీ వస్తుందనే ప్రచారం ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన నయనీ పావని. ఈ అమ్మడు.. అడుగుపెట్టిన వారంలోనే తిరుగుముఖం పట్టింది. ఒక్క వారమే ఉండి ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఈమెను తీసుకురావాలని అనుకున్నారట బిగ్ బాస్ టీం. బిగ్ బాస్ 7నుండి బయటకు వచ్చిన ఆమె.. నీతోనే డ్యాన్స్ 2.0లో యావర్‌కు జంటగా వచ్చింది. ఇక్కడ కూడా మొదటి వారానికే ఆ షోకు గుడ్ బై చెప్పేసింది.ఇక సోషల్ మీడియాలో క్రేజ్ ఏర్పాటు చేసుకుంది ఈ బ్యూటీ. తన హాట్ ఫోటోలతో నెటిజన్లను కాక పుట్టిస్తుంది. ఈ అమ్మడికి ఇన్ స్టాలో మిలియన్ చేరువగా ఫాలోవర్స్ ఉన్నారు. పలు షార్ట్స్ ఫిల్మ్స్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈమెను తీసుకువస్తే.. బిగ్ బాస్‌కు మరింత వ్యూస్ వస్తాయని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వారం విషయానికి వస్తే ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అభయ్, మణికంఠ, సీత, విష్ణు ప్రియ, యష్మీ గౌడ, ప్రేరణ, నైనిక, పృథ్వీ నామినేషన్స్‌లో ఉన్నారు. మణికంఠ, పృధ్వీలో ఒకరు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో రెండు ఎలిమినేషన్లు ముగిశాక.. వైల్డ్ కార్డు ఉండొచ్చునని తెలుస్తుంది. నయని పావని వస్తుందో లేదో లేక మరొకరి ఎంట్రీ ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: