ప్చ్.. సాయి ధరమ్ తేజ్ మళ్లీ సోలోగానే పోరాడాలా?

savitri shivaleela
కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లను తిరిగి ఓపెన్ చేసినా.. అందులో తమ సినిమాలు రిలీజ్ చెయ్యడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం ఒకడుగు ముందుకు వేసి తన ‘సోలో బ్రతుకే  సో బెటర్’ సినిమాను రిలీజ్ చేశాడు. ప్రేక్షకులు వస్తారో రారో నన్న కొంచెంపాటి అనుమానాన్ని పటాపంచలు చేస్తూ ప్రేక్షకులు ఈ సినిమాకు బారులు తీరారు. వారిని చూసి ఈ చిత్ర యూనిట్ ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. చూడటమే కాదు ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబెట్టారు. ఈ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ద్వారా గతేడాది మంచి హిట్ ను అందుకున్న సాయి ధరమ్ తేజ్ తర్వాత వచ్చే సినిమా కూడా ఇంతకన్నా పెద్ద హిట్ ను అందుకోవాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవకట్టా డైరెక్షన్ లో ఒక సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ మూవీని జె.బి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్, జె.పుల్లారావు లు నిర్మిస్తున్నారు. కానీ పొలిటికల్స్, దేశ సేవ వంటి కథలు ఈ హీరోకు కలిసొస్తాయో లేదోనని ఫ్యాన్స్ తెగ మదనపడుతున్నారు. అయితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించబడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులోఈ సుప్రీమ్ హీరో ఐఏఎస్  ఆఫీసర్ గా.. నీట్ ఫార్మల్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది.  
అయితే ఇంతకు ముందు కూడా ఇలాంటి లుక్ లోనే కనిపించాడు సాయి ధరమ్ తేజ్. జవాన్, ఇంటెలిజెంట్ సినిమాలో ఇలాగే కనిపించాడు ఈ హీరో.. అవి అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిందే. మళ్లీ ఇదే లుక్ లో కనిపిస్తాడని వార్తలు విన్నతేజ్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. అయితే ఈ సినిమాలో నివేతా పేతురాజ్ తేజ్ కు జోడీగా నటిస్తోంది. కానీ ఈ బ్యూటీకి ఆడియెన్స్ ను మెప్పించే స్టామినా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే మళ్లీ తేజ్ సోలోగా ఈ సినిమాను ప్రేక్షకులు మెప్పించడానికి పోరాడాల్సిందేనని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: