8 సంవత్సరాల తర్వాత.. మళ్లీ అలా చేయబోతున్న పూజా హెగ్డే..?
అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు అదే సమయంలో బాలీవుడ్ పై కన్నేసింది అన్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లో కూడా దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు తమిళంలో కూడా నటించేందుకు పూజాహెగ్డే సిద్ధమైంది అన్నది తెలుస్తుంది.
నిజానికి 2012 సంవత్సరంలో మూగమూడి అనే తమిళ సినిమా ద్వారానే చిత్రపరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది పూజాహెగ్డే. ఇక ఆ తర్వాత టాలీవుడ్ లోకి రావడంతో తమిళ సినిమాలు చేయలేదు. ఇక ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ పూజా హెగ్డే తమిళ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయింది అనేది తెలుస్తుంది. తలపతి విజయ్ తో కలిసి సినిమాలో నటించబోతుందట పూజా హెగ్డే. విజయ్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న సినిమాలో పూజా హెగ్డే కన్ఫార్మ్ అయిపోయినట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది.