'రెడ్' సినిమా సక్సెస్ మీట్ లో హుషారైన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్న హీరో రామ్...

SS Marvels
గత సంవత్సరం 2020లో విడుదల కావాల్సిన చిత్రం... ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన మూవీ RED. కానీ కరోనా కారణంగా విధించిన వరుస లాక్ డౌన్ల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఆఖరికి లాక్ డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా విడుదల అయింది. అయితే ఇక ఈ చిత్రంలో రామ్ రెండు విభిన్న పాత్రల్లో నటించగా.. ఆయన సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ తొలిషో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) వైజాగ్‌లో RED

ఇక సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే సంక్రాంతి సమయానికి 'దేవదాస్' సినిమాతో వచ్చా. నేనెప్పుడూ కాంపిటేషన్ గురించి ఆలోచించేవాడిని కాదు. కానీ 15 ఏళ్ల తర్వాత నాకు కాంపిటేషన్ ఎవరనేది అర్థమైంది.. అది మీరే. ఇక నుంచి మీరా.. నేనా? అనేది చూపిస్తా. మీరు చూపించే ప్రేమ ఎక్కువా లేక నేను స్క్రీన్ మీద నేను చూపించే ప్రేమ ఎక్కువా? అనేది ఇక తేల్చుకుంటా. మర్చిపోను.. కాంపిటేషన్ చాలా సీరియస్‌గా తీసుకుంటా'' అని రామ్ అన్నారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ''మా సినిమాను సక్సెస్ చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నా. వైజాగ్‌కి, నాకు మంచి అనుబంధం ఉంది. షూటింగ్ మాత్రమే కాదు స్క్రిప్ట్ కోసం కూడా నేను వైజాగ్ వస్తుంటా. సినిమా సక్సెస్‌లో భాగమైన మంచి మంచి మాటలన్నీ ఈ సముద్రం ముందు కూర్చొని రాసినవే. RED సక్సెస్‌లో మెయిన్ పాత్ర హీరో రామ్‌దే. థాంక్యూ సో మచ్'' అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: