దేవుడితో పందెం కాసి మూడో కొడుకును కన్నా అల్లు అరవింద్
మూడో కొడుకు కన్ను మూయడంతోబాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు సినిమాకి ఇండస్ట్రీ లో ఎవరికీ వారు బాగానే సెటిల్ అయ్యారు. అయితే బయట ప్రపంచానికి తెలియని విషయం ఏంటి అంటే అల్లు శిరీష్ పుట్టడానికి కన్నా ముందే అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు ఉండేవారట. మూడో కుమారుడు ఒక రోడ్ ప్రమాదంలో మరణించగా అల్లు అరవింద్ పూర్తి డిప్రెషన్ కి వెళ్ళిపోయాడట. ముగ్గురు కొడుకులు పుట్టాక పిల్లలు ఇక పిల్లలు వద్దనుకుని ఆపరేషన్ చేయించుకున్నారట అల్లు అరవింద్. కానీ తన మూడో కొడుకు మల్లి పుట్టాలని ఉద్దేశం తో పిల్లలు పుట్టాలని రి-ఆపరేషన్ చేయించుకున్నారట. ఆలా తన మూడో కొడుకు చనిపోయిన ఏడాది లోపే అల్లు అరవింద్ భార్య గర్భవతి అయ్యిందట.
అలా అల్లు శిరీష్ జన్మించాడట. కానీ అల్లు అరవింద్ మూడో కొడుకు పోయాక మల్లి కొడుకు కావలని మొక్కని దేవుడు లేడు అంటూ అతడు పడిన వేదన, కష్టం దగ్గర ఉండి చుసిన పరుచూరి బ్రదర్స్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. చనిపోయిన కొడుకు కోసం దేవుడితో పందెం కాసాడని అలాగే అనుకున్న విదంగా మల్లి కొడుకు పుట్టడం తో అరవింద్ మాములుగా అయ్యాడట. ఇలా భగవంతుడితో పోరాటం చేసి మరో కొడుకును కన్నాడంటూ పరుచూరి బ్రదర్స్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.