రంగ్ దే ఒటీటీకేనా ? మళ్ళీ మొదలయిన రచ్చ !
అయితే ఆ క్లారిటీ ఇవ్వడంతో కొంత ఆ ప్రచారం ఆగింది అనుకోండి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే నితిన్ మార్కెట్ను పరిగణనలోకి తీసుకుని జీ5 సంస్థ ఈ సినిమాకి 28 కోట్లు కోట్ చేసింది, అయితే మేకర్స్ మాత్రం 40 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. అందుకే ఈ డీల్ ఇంకా లాక్ కాలేదని అన్నారు. మళ్ళీ ఏమయిందో ఏమో కానీ మళ్ళీ ఈ సినిమా ఓటీటీకి వెళుతుందని అంటున్నారు. పే-పర్-వ్యూ ప్రాతిపదికన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని వారు యోచిస్తున్నారు. జీ ప్లెక్స్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయాలనీ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రేక్షకులు సినిమాను చూడటానికి టోకెన్ టికెట్ ధర చెల్లించాలి.
అయితే దీని గురించి మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. రామ్ గోపాల్ వర్మ తన తక్కువ బడ్జెట్ చిత్రాలకు ఈ మోడల్ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ చాలా వరకు పూర్తయింది. కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.