మీ నెక్స్ట్ సినిమా ప్రభాస్ తోనా..?ఎన్టీఆర్ తోనా..?క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్...!!
కెజిఎఫ్ తర్వాత ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో లో మైత్రి మూవీస్ వారు సినిమా సెట్ చేసారని.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి కథ కూడా వినిపించేసాడని తెగ ప్రచారం జరిగింది. దానికి కారణం ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి విషెస్ చెప్పడం దాన్ని మైత్రి వారు పబ్లిసిటీ చెయ్యడంతో అందరూ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ కన్ఫర్మ్ అయినట్లే అనుకున్నారు. తర్వాత ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తో సినిమా అంటూ ప్రచారం జరిగింది.ప్రభాస్ రాధేశ్యాం, నాగ్ అశ్విన్, ఆదిపురుష్ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా కన్ఫర్మ్ కాబోతున్నట్టుగా, త్వరలోనే ఆ సినిమాపై ప్రకటన రాబోతున్నట్టుగా ప్రచారం జరగింది.
`కేజీఎఫ్-2` తర్వాత ఏ హీరోతో ప్రశాంత్ సినిమా చేస్తున్నాడు అనే విషయం గురించి తాజాగా ఓ నెటిజన్ ప్రశాంత్ను ట్విటర్ ద్వారా ప్రశ్నించాడు. `తర్వాత ప్రభాస్తోనా.. ఎన్టీయార్తోనా` అని అడిగాడు. దీనికి స్పందించిన ప్రశాంత్.. ``కేజీఎఫ్-2` పూర్తయిన తర్వాత మాత్రమే నా తర్వాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడతాన`ని రిప్లై ఇచ్చాడు.దీన్ని బట్టి కె.జి.ఎఫ్ పూర్తి అయ్యే వరకు మన తారక్, ప్రభాస్ లు వేరే సినిమాలకు కమిట్ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు విశ్లేషకులు.. మరి ప్రశాంత్ నీల్ కోసం మన హీరోలు వెయిట్ చేస్తారా?లేదా?అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే...!!