అనుష్క పై పైచేయి సాధించిన రాజ్ తరుణ్..!

shami
కొద్దిపాటి గ్యాప్ తర్వాత ప్రేక్షకులకు సినిమా పండుగ రాబోతుంది. అక్టోబర్ 15 నుండి థియేటర్లు ఓపెన్ అనే ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఇదిలాఉంటే ఓటిటిల రిలీజ్ కు కూడా దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక చాలా రోజుల తర్వాత ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అవడం జరిగింది. రిలీజైంది ఓటిటి లోనే అయినా సినిమాల సందడి మొదలైందని చెప్పొచ్చు.  
ఇక అనుష్క నిశ్శబ్ధం అమేజాన్ ప్రైం లో అక్టోబర్ 2, 12 గంటలకు స్ట్రీమింగ్ స్టార్ట్ అవగా.. రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా ఆహాలో నిన్న సాయంత్రం 6 గంటల నుండి స్ట్రీమింగ్ మొదలైంది. ఈ రెండు సినిమాలు రెండు వేరు వేరు జానర్లుగా వచ్చాయి.    
నిశ్శబ్ధం సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కినా సస్పెన్స్ థ్రిల్లర్ కు కావాల్సిన స్ట్రాంగ్ కంటెంట్ లేదని టాక్ వస్తుంది. డైరక్టర్ హేమంత్ మధుకర్ పెద్ద కాస్ట్ అండ్ క్రూని వేస్ట్ చేశాడని అంటున్నారు. అనుష్క డెఫ్ అండ్ డమ్ రోల్ కు పూర్తి న్యాయం చేసినా సినిమా ఆశించిన స్థాయిలో లేదని టాక్ వచ్చింది.  
ఇక రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా విషయానికి వస్తే.. రొటీన్ కథే కాని ప్రేక్షకులను కామెడీతో పడగొట్టాడు డైరక్టర్ విజయ్ కుమార్ కొండ. సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. పెద్దగా ట్విస్టులేమి లేకుండా ఒరేయ్ బుజ్జిగా సింపుల్ గా హాయిగా వేళ్ళినట్టు అనిపిస్తుంది. ఓ రకంగా అనుష్క నిశ్శబ్ధం పై రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా పైచేయి సాధించిందని చెప్పొచ్చు.                                                         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: