కీర్తి సురేష్ రిస్క్ చేసేందుకు రెడీ.. హీరోయిన్ గా కాదు..?

shami
మళయాళ భామ కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో క్రేజీ సినిమాలు చేస్తుంది. తెలుగులో ఆమె నటించిన మహానటి సినిమాకు నేషనల్ అవార్డ్ రాగా తెలుగులో ఇప్పుడు ఆమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతుండగా నితిన్ తో చేసిన రంగ్ దే కూడా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది.
ఇక ఇదే కాకుండా సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాటలో ఛాన్స్ అందుకుంది. ఇదే కాకుండా అక్కడ తలైవా రజినికాంత్ తో అన్నాత్తే సినిమాలో కూడా నటిస్తుంది. హీరోయిన్ గా తీరిక లేకుండా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు నిర్మాతగా మారబోతుందని తెలుస్తుంది. నిర్మాతగా కీర్తి సురేష్ ఓ వెబ్ సీరీస్ ను నిర్మిస్తుందని తెలుస్తుంది. హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంటూనే నిర్మాతగా వెబ్ సీరీస్ నిర్మించాలని అనుకోవదం సాహసమే అని చెప్పొచ్చు.
నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెబ్ సీరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఆ వెబ్ సీరీస్ లో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా కీర్తి సురేష్ ఇన్వెస్ట్ చేస్తుందని తెలుస్తుంది. తమిళ భాషలో తెరకెక్కే ఈ వెబ్ సీరీస్ ను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి స్టార్ హీరోయిన్ గా చేస్తూ వెబ్ సీరీస్ నిర్మించాలనే కీర్తి సురేష్ ప్లాన్ అదిరిందని చెప్పొచ్చు. అమ్మడు ప్రొడ్యూసర్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.                                                 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: