పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్నా భాటియా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమన్నా భాటియా కలసి కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. 2012 వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాతోనే తమన్నా మొట్టమొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జతకట్టింది. అయితే చిత్రీకరణ సమయంలో సెట్ లో పవన్ కళ్యాణ్ ఎలా ఉండేవారు అనేది తమన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ... నేను మెగా ఫ్యామిలీతో కలిసి పలు సినిమాల్లో నటించాను. రచ్చ లో రామ్ చరణ్, సైరా నరసింహారెడ్డి లో చిరంజీవి తో కలిసి నటించినప్పుడు వారికి బీభత్సమైన స్టార్డం ఉన్నప్పటికీ ఏ గొప్పల కి పోకుండా చాలా కష్టపడి పని చేయడం నేను గమనించాను. ఇతర హీరోల్లాగా కాకుండా మెగా ఫ్యామిలీ వారు అందరితో కలిసి మెలిసి ఉంటూ అతి సామాన్యులుగా ప్రవర్తిస్తారు. వారితో కలిసి పనిచేసిన రోజులను నేను ఎంతో ఎంజాయ్ చేశాను. పవన్ కళ్యాణ్ తో కలసి నేను కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నటించాను. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం.
'సినిమా చిత్రీకరణ ప్రారంభమైన సమయం లో పవన్ కళ్యాణ్ ని చూసి నేను బాగా భయపడి పోయేదాన్ని. కానీ పవన్ కళ్యాణ్ గారు నాతో చాలా సౌకర్యవంతంగా మాట్లాడుతూ నాలో భయాన్ని పోగొట్టారు. అతను అలా మాట్లాడుతుంటే నేను చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి సెట్స్ లో అణువంతైనా ఇబ్బంది పడకుండా నటించగల గాను. ఈ చిత్ర దర్శకుడు అయిన పూరీ జగన్నాథ్ తో పాటు పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయడం నాకు మంచి జ్ఞాపకాలు మిగిల్చింది', అని ఆమె చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఇప్పటివరకు ఏ నటుడు గాని ఏ నటీమణిగా గాని పవన్ కళ్యాణ్ ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని తప్పుగా చెప్పిన సందర్భాలు అసలు లేవు.