తెలుగు వాడు మర్చిపోలేని దానవీర శూర కర్ణ డైలాగ్
జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా....ఎంతమాట ఎంత మాట
ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదా? కాదు కాకూడదు...
ఇది కుల పరీక్షయే అందువా....నీ తండ్రి భరధ్వాజుని జననమెట్టిది?
అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా నీది యే కులము...
ఇంత యేల, అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రల భార్యయగు
గంగా గర్భమున జనియించలేదా... ఈయనది యే కులము?
నాతో చెప్పిస్తివేమయ్యామా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవ వేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా...?
ఆతడు పంచమజాతి కన్యయైన అరుంధతియందు శక్తినీ ఆ శక్తి ఛండలాంగనయందు పరాశరునీ
ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్యగంధియందు మా తాత వ్యాసునీ
ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రినీ
పినపితామహి అయిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజునూ
మాయింటి దాసితో ధర్మనిర్మాణజనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదుర దేవుని కన లేదా.....
సందర్భావసరములనుబట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురు వంశము ఏనాడో కుల హీనమైనది.
కాగా నేడు కులము కులము అని వ్యర్థ వాదమెందులకు?`
ఈ ఒక్క డైలాగ్ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.