నీ సేవలు మరువం.. సోనూ సూద్ కి హారతి ఇచ్చి స్వాగతం పలికిన మహిళలు..!

Edari Rama Krishna

లాక్‌డౌన్‌ తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు సాయం చేస్తూ సినీనటుడు సోనూ సూద్ రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకుంటు న్నాడు. వలస కార్మికులందరూ తమ ఇళ్లకు వెళ్లే వరకు సాయం చేస్తూనే ఉంటానని ప్రకటించిన ఆయన  లేటెస్ట్ గా వారి కోసం మూడు రైళ్లు బుక్‌ చేశాడు. ప్రస్తుతం నటుడు సోనూసూద్ అంటే వలస కూలీల పాలిట ఓ హీరో. అన్నా.. మేం ఫలానా చోట చిక్కుకుపోయాం అని అతడికి సమాచారం అందిస్తే చాలు ఎలాగైనా వారిని ఇంటికి చేరుస్తూ వారి పాలిట దైవంలా మారుతున్నాడు. వలస కూలీలను ప్రత్యేక బస్సుల్లో వారి సొంత గ్రామాలకు చేరుస్తున్నాడు.

 

ఈ క్రమంలో సోనూ సూద్ ను సోషల్ మీడియా పొగడ్తల్లో ముంచెత్తుతోంది. కేరళలో చిక్కుకున్న ఒడిశా అమ్మాయిల కోసం ఏకంగా విమానం ఏర్పాటు చేశారు.  సోనూ సూద్ వలస కార్మికుల కోసం చేస్తున్న కృషికి దేశ ప్రజలు ఫిదా అవుతున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం సోనూ సూద్ ను మెచ్చుకోక ఉండలేకపోయారు. తాజాగా ముంబైలో చిక్కుకున్న 200 తమిళులను సోనూ సూద్ స్వరాష్ట్రం తమిళనాడుకి పంపారు. శుక్రవారం ఒక బస్సును ముంబై నుంచి తమిళనాడుకు పంపించారు. ముందుగా ఆ బస్సుకు సోను సూద్‌ కొబ్బరికాయ కొట్టి వారందరినీ సంతోషంగా పంపించారు. దీంతో ఆ తమిళులందరూ హారతి పట్టి కృతజ్ఞతలు తెలిపారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
@Sonu_Sood sent across 200 idliwalas back to their {{RelevantDataTitle}}