మహేష్ కాంపౌండ్ లో హరీష్ శంకర్ ఎంట్రీ టెన్షన్ లో పరుశు రామ్ !

Seetha Sailaja

‘గీత గోవిందం’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరుశు రామ్ కు కొనసాగితున్న కష్టాలు చూస్తే ఎవరికైనా ఆ ఆశ్చర్యం కలుగుతుంది. మహేష్ తో పరుశు రామ్ మూవీ ఫైనల్ అయినా ఆ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. కరోనా కష్టాలతో ఇండస్ట్రీ లో షూటింగ్ లు అన్ని ఆగిపోవడంతో మహేష్ పరుశు రామ్ ల మూవీ ప్రకటన కూడ ఆగిపోయింది. 


ఈ మూవీ వచ్చేనెల మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు ప్రారంభం అవుతుంది అని వార్తలు వస్తున్నా ఆ వార్తలను పరుశు రామ్ కూడ ధృవీకరించక పోవడంతో అనేక సందేహాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో దర్శకుడు హరీష్ శంకర్ మహేష్ కు ఈ మధ్య ఫోన్ లో ఒక కథ చెప్పాడు అని వస్తున్న వార్తలు చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి.  


ఈ మధ్య హరీష్ శంకర్ తీసిన ‘గద్దలకొండ గణేష్’ మూవీని మహేష్ ఈ లాక్ డౌన్ పీరియడ్ లో తన ఇంటిలో చూసి ఈ మూవీ బాగా నచ్చడంతో హరీష్ కు ఫోన్ చేసి ఏదైనా మంచి కథ ఉంటే చెప్పమని కోరినట్లు తెలుస్తోంది. వాస్తవానికి హరీష్ శంకర్  పవన్ తో ఒక సినిమా చేయాడానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో బాగా బిజీగా ఉన్నాడు.  


అయితే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి  చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ అదేవిధంగా క్రిష్ తో చేస్తున్న మూవీలు ఈ లాక్ డౌన్ తో ఆగిపోవడంతో ఈ సినిమాలు పూర్తి అయ్యేదాకా హరీష్ శంకర్ పవన్ ల మూవీ ప్ర్రారంభం కాదు. అందువల్ల హరీష్  ఒక వైపుపవన్ సినిమాకు కథ వ్రాస్తూనే మహేష్ కోసం కూడా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. మహేష్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని రాస్తున్న ఈ కథ మహేష్ కు బాగా నచ్చి ఫైనల్ అయితే పరుశు రామ్ మూవీ పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీలో వార్తలు గుప్పు మంటున్నాయి.. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: