బిగ్ బ్రేకింగ్: క్రేజీ కపుల్ బ్రేకప్..!
తాజాగా ఈ లిస్టులోకి మరో క్రేజీ కపుల్ చేరినట్టు టాక్. కలిసి ఒక్క సినిమా కూడా చేయకుండానే ప్రేమలో పడ్డారు బాలీవుడ్ క్రేజీ జోడి రణ్బీర్ కపూర్, అలియా భట్. గత కొన్ని రోజులుగా వీరిద్దరు కలిసి బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈ ఇద్దరు క్రేజీ కపుల్ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలిసిందే. వీరు పెళ్లి చేసుకుంటారా ? అన్న చర్చలు కూడా నడిచాయి. అయితే సడెన్గా ఇంతలోనే ఏమైందో గాని చాక్లెట్ భాయ్ రణబీర్, స్వీటి గర్ల్ ఆలియా లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పడిందని అంటున్నారు.
ఇటీవల జరిగిన ఆలియా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు కుటంబ సభ్యులు , స్నేహితులు.. ప్రతి ఒక్క సినీ సెలబ్రిటీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ బర్త్ డే వేడుకలకు మాత్రం రణబీర్ రాలేదు. ఇక పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. కొద్ది రోజులుగానే వీరు సఖ్యతతో ఉండడం లేదని.. దీంతో వీరిద్దరు బ్రేకప్ తీసుకున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇక గతంలో రణబీర్ దీపికా పదుకొనె, కత్రినా కైఫ్, సోనమ్ కపూర్ లతో ప్రేమ వ్యవహారాలు నడిపి వారికి బ్రేకప్ చెప్పారు. తాజాగా ఆ జాబితాలో అలియా కూడా చేరడం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి నటిస్తోన్న బ్రహ్మాస్త్ర సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు.