ఈసంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలకాగా అందులో రెండు సినిమాలు.. సరిలేరు నీకెవ్వరు , అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి టాలీవుడ్ కు ఫుల్ జోష్ ను ఇచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదలై సుమారు 140కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా కన్నాఒక్క రోజు ఆలస్యంగా వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల.. వైకుంఠపుములో అయితే యూనానిమస్ పాజిటివ్ టాక్ తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది.
ఈరెండు సినిమాలు కలిపి ప్రపంచ వ్యాప్తంగా 350కోట్ల వసూళ్లను రాబట్టాయి. ఇక ఈ సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి రానున్నాయి. సరిలేరు డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా మార్చి 7న అందులో స్ట్రీమింగ్ కానుంది. అల వైకుంఠపురములో డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ దక్కించుకోగా ఏప్రిల్ 8న ఈ చిత్రం అందులో విడుదలకానుంది. అదే రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు కూడా కావడం విశేషం.
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా విజయశాంతి కీలక పాత్రలో కనిపించింది. ఈసినిమాతో అనిల్ వరసగా 5 వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక అల .. వైకుంఠపురములో ను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో టబు ,జయరాం ,మురళి శర్మ ,సుశాంత్ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా తో త్రివిక్రమ్ ఏకంగా ఇండస్ట్రీ హిట్ సినిమాను అందించాడు.