మెగా హీరోలు కలిస్తే క్రికెట్ టీమే..! వైరల్ అవుతున్న పిక్

Murali

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంతా కలిసి ఓ చోట చేరితే ఆ సందడే వేరుగా ఉంటుంది. చిన్నా, పెద్దా అందరూ కుటుంబాలతో కిలసిమెలసి చేసుకునే ఏ సందడైనా చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంటాయి. మెగా అభిమానులకు ఇలాంటి సందర్భాలు చిరంజీవి సినిమా రిలీజ్ అయినంత సంబరపడతారు అనడంలో సందేహం లేదు. అటువంటి సందడే ఈ సంక్రాంతికి కూడా మెగా ఇంట జరుగుతోంది. ఇప్పటికే నిన్నటి భోగి సంబరాలను, చలిలో భోగి మంటల వెచ్చదనాన్ని కలిసి జరుపుకున్నారు. ఆ పిక్స్ నిన్నంతా సోషల్ మీడియాలో హోరెత్తిపోయాయి.

 

 

నేడు మకర సంక్రాంతి సందర్భంగా కూడా వీరంతా చిరంజీవ ఇంట్లో పండగ సంబరాలను జరుపుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. చిరంజీవి తన ఫ్యామిలీలోని యంగర్ జనరేషన్ తో దిగిన ఈ ఫొటో చూసేందుకు ఎంతో బాగుంది. ఈ పిక్ ను మెగా ప్రిన్స్, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్గ్ చేశాడు. దీంతో ఈ పిక్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. మెగా ఫ్యామిలీ హీరోలందరినీ కలిపితే ఓ ఇండియన్ క్రికెట్ టీమ్ అవుతుంది అనే సినీ నానుడిని ఈ పిక్ రుజువు చేస్తోంది.

 

 

ఈ పిక్ లో పవన్ కల్యాణ్ – రేణు దేశాయ్ ల తనయుడు అకీరానందన్ కూడా ఉండటంతో మరింత స్పెషల్ గా మారింది. మెగాభిమానులందరూ ఈ పిక్ ను బాగా వైరల్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ పిక్ లో చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కల్యాణ్ దేవ్, అకీరా నందన్ లతో నిండుగా ఉందనే చెప్పాలి.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Wishing you all a very happy sankranti!

A post shared by {{RelevantDataTitle}}