సూపర్ స్టార్ మహేష్ బాబు -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈఏడాది మొదటి మచ్ అవైటెడ్ మూవీగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకోవడంతో తొలి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్ ను రాబట్టుకుంది. అందులో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఈ చిత్రం మొదటి రోజు 37,27,020 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టి అక్కడ అత్యధిక ఓపెనింగ్ ను రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇంతకుముందు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బాహుబలి 2 మొదటి రోజు 36,09,236 లక్షల గ్రాస్ రాబట్టగా సాహో 34,29,293 లక్షల గ్రాస్ ను అలాగే అజ్ఞాతవాసి 28,96,772 లక్షల వసూళ్లను రాబట్టాయి. మరో వైపు సరిలేరు నీకెవ్వరు అటు ఓవర్సీస్ లో 1మిలియన్ డాల్లర్ల వసూళ్లను రాబట్టింది తద్వారా ఏకంగా 10వసారి 1మిలియన్ క్లబ్ లో చేరిన మొదటి సౌత్ హీరోగా మహేష్ రికార్డు సృష్టించాడు.
ఇక ఈ సినిమా ద్వారా మహేష్ ను అతని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలా చూపించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పక్కా మాస్ మసాల కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో మహేష్ వన్ మ్యాన్ షో చేశాడు. తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో మునుపటి సినిమాల్లో కన్నా మరింత అందంగా కనిపించి అదరగొట్టాడు. ఎన్నడూ లేని విధంగా ఈసారి డ్యాన్స్ లోకూడా తన ట్యాలెంట్ చూపించాడు. వీటితోపాటు ఇంటర్వెల్ బ్లాక్ , మహేష్ - ప్రకాష్ రాజ్ మధ్య సన్నివేశాలు సినిమాకు హైలైట్ అయ్యాయి. రష్మిక మందన్న కథానాయికగా నటించిన ఈ చిత్రంలో విజయశాంతి ముఖ్య పాత్రలో కనిపించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు