తొలిసారి పవర్ స్టార్ తో పనిచేయబోతున్న కీరవాణి...??

Mari Sithara

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా తరువాత, సినిమాలకు విరామం ప్రకటించి, అక్కడి నుండి రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ లో తన జనసేన పార్టీ తరపున పోటీ చేసిన పవన్, రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక ప్రస్తుతం తన పార్టీ కార్యకలాపాలతో పూర్తిగా బిజీ అయిన పవన్, గత కొద్దిరోజులుగా ఫ్యాన్స్ తమ కోసం ఒక్క సినిమా చేయమని కోరుతున్నందున ఎట్టకేలకు మళ్ళి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అతి త్వరలో పవన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ పట్టాలెక్కనుంది. 

 

బోనీ కపూర్, దిల్ రాజూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పుడే స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనపడుతోంది. ఇకపోతే దీని తరువాత పవన్, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నాని కూడా కొద్దిరోజలుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కథను క్రిష్ ఎంతో గొప్పగా రాసుకున్నారని, ఇక ఈ కథ నచ్చడంతో ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం, దీనిని నిర్మించడానికి ముందుకు వచ్చారని అంటున్నారు. 

 

వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం కాబోయే ఈ సినిమాకు స్వరవాణి కీరవాణిని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారట. ఇప్పటివరకు మెగాస్టార్, మెగా పవర్ స్టార్ , స్టైలిష్ స్టార్లతో పని చేసిన కీరవాణి, ఈ సినిమా ద్వారా తొలిసారి పవన్ తో పని చేయనున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడి కావడానికి మరికొంత సమయం పడుతుందని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్త కనుక నిజమే అయితే, తొలిసారిగా కీరవాణితో పవన్ కలయికలో ఒక మంచి మ్యూజికల్ హిట్ మూవీ వచ్చినట్లే.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: