మెగా హీరో సాయి తేజ్, మినిమం గ్యారెంటీ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. అందులో భాగంగా 5రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 14.5కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. ఈ రోజు క్రిస్మస్ కావడంతో థియేటరర్లు ముందు హౌస్ ఫుల్ బోర్డులు పడడంతో ఈ రోజు ఈ చిత్రం ఎక్స్ట్రాడినరీ వసూళ్లను రాబట్టుకోనుంది. అలాగే ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇప్పటివరకు 360k డాలర్ల ను రాబట్టి ఫుల్ రన్ లో హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసేలా వుంది.
ఇక ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకోగా డిజిటల్ హక్కులను హాట్ స్టార్ దక్కించుకుంది. ఈహక్కుల కోసం హాట్ స్టార్ 4.5కోట్లు చెల్లించిందని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న ఈ చిత్రం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. హాట్ స్టార్ విఐపి సబ్స్క్రిప్షన్ వున్న వారు మాత్రమే ఈ చిత్రాన్ని అందులో చూడవచ్చు.
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా సీనియర్ నటులు సత్యరాజ్ , రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.
ఇక గత ఏడాది శైలజారెడ్డి అల్లుడు తో షాక్ తిన్న మారుతి ఈ సారి ప్రతి రోజు పండగే కే తో హిట్ కొట్టి ఫామ్ లో రాగ చిత్రలహరి తరువాత సాయి తేజ్ ఈచిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.