సీరియస్ అయ్యిన నాగార్జున..?
ఇదే తరుణంలో ఈ సంవత్సరం కూడా ఆ వేడుకకు మొత్తం రంగం సిద్ధం చేశారు. దివంగత శ్రీదేవి మరియు సీనియర్ నటి రేఖ కు అవార్డులు ప్రధానం చేయనున్నారు. ఈ నెల 17న హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ఈ వేడుక జరగనుంది. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ని గురువారం నాడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ క్రమంలో నాగార్జునని ఇంటర్వ్యూ చేయాలనుకుంది ప్రముఖ న్యూస్ ఛానెల్. యాంకర్.. కెమెరా, మైక్ తో రెడీ అయిపోయింది.
ముందుగా ఆమె నాగార్జునను.. 'మీ నాన్నగారు బిగ్ బాస్ హౌస్ లో ఉండి, మీరు హోస్ట్ గా ఉంటే.. మీ రియాక్షన్ ఏంటి..?' అని ప్రశ్నించింది. ఇదే ఇంటర్వ్యూలో మొదటి ప్రశ్న. అయితే ఈ ప్రశ్న నాగార్జునకి నచ్చలేదు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. 'లేని నాన్నగారిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు లాగుతారు.. ముందు కెమెరా మూసేయండి' అంటూ కాస్త సీరియస్ గానే సమాధానం చెప్పేసరికి యాంకర్ చిన్నబుచ్చుకుంది. ఆ తరువాత యాంకర్ కి నాగార్జునకి మధ్య కాసేపు సంభాషణ జరిగింది. సదరు యాంకర్.. నాగార్జునకి సారీ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.