ప్రయోగాత్మక చిత్రాల పేరు చెప్పగానే మొదట వినిపించే పేరు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుది. అయితే 1991లో బాలకృష్ణ కథానాయకుడి గా లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం లో `ఆదిత్య 369` తెరకెక్కిన సంగతి తెలిసిందే. సైన్స్ఫిక్షన్ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఒక ముఖ్యమైన గుర్తింపును పొందింది. ఈ సినిమా కి సీక్వెల్ తెరకెక్కనుందని నాలుగైదేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బాలయ్య 100 వ సినిమాగా ఆదిత్య 369 సీక్వెల్ చేస్తారనే వార్తలు వచ్చాయి.
కానీ బాలయ్య కెరీర్ కాస్త డౌన్ ఫాల్ లో ఉన్న నేపథ్యం లో రిస్క్ తీసుకో లేక ఆలస్యం చేస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. అయితే టైమ్ మెషీన్ నేపథ్యం లో తెరకెక్కించే ఓ సినిమా లో కళ్యాణ్ రామ్ నటించబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఐదు దశాబ్ధాల ముందు అంటే 1950 సమయం లో నడిచే స్టోరీ ఇదని సమాచారం. అలాగే ఈ సినిమాకి సింగీతం స్థానం లో కొత్త దర్శకుడు మల్లిడి వేణు వహించనున్నట్టుగా ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.
అదే విధంగా భూత- భవిష్యత్- వర్తమాన కాలాలను ఆధారంగా చేసుకుని టైమ్ మెషీన్ బ్యాక్ డ్రాప్ లో కళ్యాణ్ రామ్ కోసం ఓ స్క్రిప్టు కూడా రెడీ అయ్యిందట. అయితే వీటిపై స్పష్టమైన క్లారీటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఎంత మంచివాడవురా. సతీష్ విగ్నేశ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేహరీన్ కథానాయకగా నటిస్తుంది. ఇక ఈ సినిమా అనంతరం కళ్యాణ్ రామ్ తదుపరి ప్రాజెక్ట్ పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.